Brahmamgari Kalagnanam… 2025లో ప్రపంచానికి పెనుముప్పు

Brahmamgari Kalagnanam Prediction in 2025

ఈ ఏడాది ప్రారంభం నుంచే ప్రకృతి విపత్తులు సంభవించాయి. మయన్మార్‌, థాయ్‌లాండ్‌, బ్యాంకాక్‌, నేపాల్‌ తదితర దేశాల్లో పెద్ద ఎత్తున భూమి కంపించడంతో వేలాదిమంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో భూకంపాలు కొనసాగుతున్నాయి. భూకంపాలతో పాటు యుద్ధాలు కూడా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యంగా మధ్య ఆసియా ఖండంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది.

ఇజ్రాయిల్‌ గాజా వార్‌

ఇజ్రాయిల్‌- గాజా మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకు తీవ్రం అవుతున్నది. చావుదెబ్బ తింటున్నా హమాస్‌ తీవ్రవాదులు వెనకడుగు వేయడంలేదు. తక్కువ కాలంలో పుంజుకొని దాడులు చేస్తున్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రపంచానికి సవాల్‌ విసురుతున్నారు. ఇజ్రాయిల్‌ పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంలో లక్షలాదిమంది అమాయకులు మృత్యువాత పడ్డారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గాజాను పునరుద్దరించాలంటే సాద్యంకాని పని. ఇలానే యుద్ధం మరికొంతకాలంపాటు కొనసాగితే ప్రపంచపటంలో గాజా అనే నగరం కనుమరుగవ్వడం ఖాయం.

రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం

అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిత్వం చేస్తున్నా యుద్ధాన్ని నివారించడం సాధ్యం కావడం లేదు. ప్రపంచపటంలో గాజా లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయిల్‌ పావులు కదుపుతున్నది. మరోవైపు ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం కూడా ఇంచుమించుగా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్‌ దిగొచ్చే వరకు లేదా ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునే వరకు రష్యా వెనకడుగు వేయడం లేదు. అంతకంతకు బలం పుంజుకుంటూ విరుచుకుపడుతున్నది. యూరప్‌లో అందమైన నగరాల్లో ఒకటిగా పేరుగాంచిన ఉక్రెయిన్‌ ఇప్పుడు కళావిహీనంగా మారిపోయింది. కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తోంది. ప్రపంచంలో ప్రకృతి విపత్తులు, యుద్ధాలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞాంలో పేర్కొన్నారు. ఈ పరిస్థితులు మరింత దారుణంగా మారి చేయి దాటే పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు.

వరదలు కరువు… చంపుకోవడం పీక్కుతినడం

తీవ్రమైన కరువు కాటకాలతో ప్రపంచ దేశాల్లో అల్లాడిపోతాయి. ఏం తినాలో తెలియక ప్రజలు అల్లాడిపోతారు. ఆకలి చావులు పెరిగిపోతాయి. ఆహారం దొరక్క ఒకరిని మరొకరు పీక్కుతినే రోజులు వస్తాయని కూడా కాలజ్ఞానం తెలియజేసింది. తీవ్రమైన వరదలు ముంచెత్తుతాయని, తానేందు చుక్కనీరు కూడా దొరక్క దాహార్తితో అలమటించిపోతారని కాలజ్ఞానం పేర్కొన్నది. భారతదేశంలోనూ విధ్వంసం, వినాశనాలు చోటుచేసుకోనున్నాయి. శ్రావణ, బాధ్రపద మాసాల్లో పెద్ద ఎత్తున తుఫానులు, వరదలు సంభవిస్తాయి. ఈ వరదలు వేలమందిని పొట్టనపెట్టుకుంటుందని కాలజ్ఞానం చెప్పబడింది. తుఫానులతో పాటు సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో తీరప్రాంతంలోని నగరాలు ముంపుకు గురౌతాయని, నగరాల్లో అపారమైన జననష్టం సంభవిస్తుందని కాలజ్ఞానం పేర్కొన్నది.

తిరుమల ఆలయంలో వింత ఘటన

మరో ముఖ్యమైన సంఘటన జరిగే అవకాశం కూడా ఉంది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలోని విగ్రహం కుడిభుజం కదులుతుందని, ఇది ప్రపంచ వినాశనానికి హేతువుని అంటారు. కొన్ని దేవాలయాల్లో వింత వింత శబ్దాలు వినబుడుతుంటాయని కూడా కాలజ్ఞానం చెప్పింది. కృష్ణానది మధ్యలో ఓ బంగారు రథం కనిప్తుందని, ఆ రథాన్ని చూసినవాళ్లు చూపును కోల్పోతారని కాలజ్ఞానం చెప్పింది. సౌరతుఫానులతో భూలోకం విలవిలలాడిపోతుందని కాలజ్ఞానం తెలియజేసింద

For More

Gold Price క్షీణించడానికి కారణాలేంటి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *