Native Async

Dussehra శరన్నవరాత్రులుః మహాలక్ష్మిగా దుర్గమ్మ దర్శనం

Dasara Navaratri 2025 Goddess Durga as Mahalakshmi Alankaram – Significance, Rituals, and Benefits
Spread the love

దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా నాలుగోరోజు దుర్గమ్మ మహాలక్ష్మీ రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. అమ్మవారిని ధనప్రదాయినిగా, సౌభాగ్యలక్ష్మిగా కూడా ఆరాధిస్తారు. మహాలక్ష్మీ అనుగ్రహం ఉంటే జీవితంలో చెడు కష్టాల నుంచి విముక్తి పొంది ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుందని నమ్ముతారు. ఇక అమ్మవారు పసిడి వర్ణంలో ధగధగ మెరిసిపోతారు. వెండి పుష్పాలతో, వివిధ రకాలైన పుష్పాలతో అమ్మవారిని ఈరోజు సేవిస్తారు. కళ్లకు ఇంపైన రూపంలో అమ్మవారిని దర్శించిన ఆరాధకుల హృదయాలు భక్తిభావంతో నిండిపోతాయి. అమ్మవారి పాదాల వద్ద అష్టలక్ష్మి ప్రతీకలతో కూడిన అలంకరణ భక్తుల్లో విశ్వాసాన్ని నింపుతుంది.

మహాలక్ష్మీదేవి దర్శనం పొందినవారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజున భక్తులు గృహలక్ష్మిని గౌరవిస్తూ ఇంటిని శుభ్రపరిచి దీపాలంకరణ చేస్తారు. స్త్రీలు ప్రత్యేకంగా మహాలక్ష్మి స్తోత్రాలను, అష్టలక్ష్మీదేవి శ్లోకాలను, అష్టలక్ష్మి అష్టోత్తరనామాలను పఠిస్తారు. అమ్మవారిని పూజించడానికి శుచి శుభ్రత ముఖ్యమైనది. ఉదయాన్నే స్నానం చేసి పసుపు, కుంకుమ, పుష్పాలు సమర్పించాలి. పాలు, పాయసం, జాగ్రత్తగా తయారు చేసిన మిఠాయిలను నేవైద్యంగా సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా పూజ సమయంలో హృదయం పవిత్రంగా ఉంచి, లోభం ద్వేషం వంటి దోషాలను విడిచిపెట్టాలి. మహాలక్ష్మి పూజ ద్వారా భక్తుని జీవితం ధన, ధాన్య, సౌభాగ్యాలతో నిండిపోతుంది. దసరా ఉత్సవాల్లో ఈరోజు అమ్మవారి దర్శనం కేవలం ఆధ్యాత్మికానందమే కాకుండా భవిష్యత్తుకు సుసంపన్నతను కూడా ప్రసాదించే శుభసూచకం కూడా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit