పితృదేవతలకు తర్పణాలు విడువకుంటే ఈ దోషాలు తప్పవు

If Tarpanam Is Neglected for Pitru Devatas, These Doshas Are Unavoidable

పితృదేవతలకు తర్పణాలు లేదా శ్రాద్ధ కర్మలను తప్పకుండా విధిగా నిర్వహించాలని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ పితృతర్పణాలు విడువకుంటే దోషాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. వీటినే పితృదోషాలని అంటారు. ఈ దోషాల వలన కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు. పితృదేవతలకు తర్పణాలు విడువకుంటే సంతాన సంబంధిత సమస్యలు ఏర్పడతాయని, సంతానాన్ని పొందడంలో అడ్డంకులు కలుగుతాయని, ఒకవేళ సంతానం ఉన్నా ఆరోగ్య సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. పితృదేవతలకు సమయానికి తర్పణాలు విడువకుంటే ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయని, సంపాదన తగ్గిపోతుందని, ఊహించని ఖర్చులు పెరుగుతాయని, వ్యాపారాలు నిలిచిపోతాయని, నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.

కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. పిల్లలు పెద్దల మాటను పెడచెవిన పెడతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గర్భసంబంధిత సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు, జాతకంలో సూర్యుడు, చంద్రుడు, శని, రాహుకేతువుల ప్రభావం అనుకూలంగా లేకపోతే పితృదోషాలు కలిగే అవకాశాలు ఉంటాయి. పితృదోషాల నుంచి బయటకురావాలంటే నిత్య పితృతర్పణాలు చేయడం, మహాలయ పక్షంలో పితృదేవతలకు శ్రాద్ధకర్మలు చేయడం వంటివి చేయాలి. అదేవిధంగా పితృదోష నివారణ హోమాలు చేయాలని పండితులు చెబుతున్నారు. గోదానం, అన్నదానం వంటివి చేయాలని పండితులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *