తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ఎన్నో సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. షెల్టర్లు, షెడ్డులు, ఉచిత మంచినీరు, ఉచిత భోజనంతో పాటు ఉచిత ప్రయాణ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. స్వామివారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే, శ్రీవారి సేవలో తరించే ఉద్యోగుల విషయంలోనూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉద్యోగులకు ఉచిత ఇళ్ల స్థలాలను అందివ్వగా ఇప్పుడు వారి భద్రత కోసం మరిన్ని నిర్ణయాలు తీసుకున్నది. శ్రీవారి ఆలయంలో పనిచేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ద్విచక్రవాహనాలపై వచ్చే ఉద్యోగులకు హెల్మెట్లు అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్వర్యంలో 500 హెల్మెట్లను పంపిణీ చేశారు. అమలాపురం, హైదరాబాద్కు చెందిన భక్తులు రెండువేల హెల్మెట్లను విరాళంగా అందించారు. వీటిని ఉద్యోగులకు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టుగా అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు రాబోయే రోజుల్లో మరో 7500 హెల్మెట్లను కూడా ఉద్యోగులకు అందించనున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరించాలని అధికారులు చెబుతున్నారు. హెల్మెట్లు భక్తి ఉట్టిపడేలా తయారు చేయించారు. కాషాయం రంగులో ఉండే ఈ హెల్మెట్లు ముందు భాగంలో శ్రీవారి తిరునామం ఉండటం విశేషం. టీటీడీ ఉద్యోగులు అని గుర్తుపట్టేందుకు ఈ హెల్మెట్లు చిహ్నంగా మారనున్నాయి.
Related Posts

కేదార్నాథ్ సన్నిథిలో ఇలా చేయడం తగునా?
వివరణాత్మక విశ్లేషణ – పవిత్రతపై అపహాస్యం అగత్యమే ఇటీవల సోషల్ మీడియాలో కనిపించిన కొన్ని వీడియోలు భారతీయుల మనసును కలచివేశాయి. హిమాలయాల్లోని అత్యంత పవిత్ర క్షేత్రమైన శ్రీ…
వివరణాత్మక విశ్లేషణ – పవిత్రతపై అపహాస్యం అగత్యమే ఇటీవల సోషల్ మీడియాలో కనిపించిన కొన్ని వీడియోలు భారతీయుల మనసును కలచివేశాయి. హిమాలయాల్లోని అత్యంత పవిత్ర క్షేత్రమైన శ్రీ…

రథయాత్రలో అద్భుతం… అంబులెన్స్కు దారి ఎలా ఇచ్చారో తెలుసా?
పూరీ జగన్నాథుడి రథయాత్ర కొనసాగుతోంది. పూరీ రథయాత్ర అంటే లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఉత్సవం. ఈ ఉత్సవంలో ఏదైనా సమస్య వస్తే అక్కడి నుంచి బయటపడటం…
పూరీ జగన్నాథుడి రథయాత్ర కొనసాగుతోంది. పూరీ రథయాత్ర అంటే లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఉత్సవం. ఈ ఉత్సవంలో ఏదైనా సమస్య వస్తే అక్కడి నుంచి బయటపడటం…

తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు
ఆధ్యాత్మిక విశిష్టత – ఎందుకు నిర్వహిస్తారు పవిత్రోత్సవాలు?శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయం తిరుపతిలో అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయంలో సంప్రదాయ శైవాగమవిధానానుసారంగా ప్రతి సంవత్సరం…
ఆధ్యాత్మిక విశిష్టత – ఎందుకు నిర్వహిస్తారు పవిత్రోత్సవాలు?శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయం తిరుపతిలో అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయంలో సంప్రదాయ శైవాగమవిధానానుసారంగా ప్రతి సంవత్సరం…