కుప్పానికి నీళ్లొచ్చాయోచ్‌

Kuppam Finally Gets Water, Thanks to Chandrababu
Spread the love

గత ఎన్నికల సమయంలో కుప్పానికి నీరు అందిస్తామని గతంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన ఈ హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నాడని మంత్రి నారా లోకేష్‌ స్పష్టం చేశారు. కుప్పానికి నీళ్లు రాకుండా చాలా మంది అడ్డుకున్నారని, ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుపడినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే నీటిని తీసుకురావడాన్ని అడ్డుకోలేకపోయారని అన్నారు. కుప్పంలోని పరమ సముద్రానికి నీటిని మళ్లించిన తీరును ఓ యూట్యూబర్‌ తన ఛానల్‌లో పెట్టగా, దానిని నారా లోకేష్‌ షేర్‌ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని మళ్లించి రాయలసీమలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. ఇందులో భాగంగానే కుప్పానికి కూడా నీటిని తరలించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *