రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ద రాజా సాబ్’ సినిమా కోసం అందరం వెయిటింగ్ కదా… ఇంకెంత జస్ట్ మూడు నెలలు వెయిట్ చేయాలి ఎందుకంటే సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కదా… ఇప్పుడు షూటింగ్ తుది దశలోకి చేరుకుంది. మొత్తం టాకీ పార్ట్, యాక్షన్ సీక్వెన్సులు పూర్తయ్యాయి. ఇక మిగిలింది కేవలం రెండు పాటలే. అందుకే టీమ్ ఇప్పుడు ఆ చివరి షెడ్యూల్ కోసం గ్రీస్కి వెళ్ళింది.
మంగళవారం ప్రభాస్ ఆ షెడ్యూల్లో జాయిన్ కాగా, థమన్ కంపోజ్ చేసిన ఓ మెలోడీ సాంగ్కి నిధి అగర్వాల్తో కలిసి స్టెప్పులు వేస్తున్నారు. ఈ సాంగ్ షూట్ పూర్తయ్యాక, సినిమాలోని ముగ్గురు హీరోయిన్లతో కలిసి ఒక మాస్ నంబర్ చిత్రీకరణ జరగనుంది.
ఈ న్యూస్ ని మేకర్స్ ఎక్స్లో పోస్టు చేస్తూ, “Rebel Star is painting Greece in his colors of glory … Team #TheRajaSaab kickstarts a new schedule with 2 chartbuster songs being crafted to Shake the nation #TheRajaSaabOnJan9th”, అంటూ ప్రకటించారు.
ఈ పోస్టుతో పాటు వచ్చిన చిన్న గ్లింప్స్లో ప్రభాస్ తెల్లటి ప్యాంట్, కలర్ఫుల్ స్నీకర్స్ వేసుకుని, ఎనర్జీతో నిండిన బీట్లకు డ్యాన్స్ చేస్తూ కనిపించాడు.
ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉండగా, వాటిలో రెండు ఇప్పటికే షూట్ అయ్యాయి. అందులో ఒకటి — ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్ — అక్టోబర్ 23న, అంటే ఆయన బర్త్డే రోజున రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఎక్కువ భాగం హైదరాబాద్లోనే స్పెషల్ సెట్స్పై చిత్రీకరించగా, ఇప్పుడు గ్రీస్ షెడ్యూల్తో టీమ్ ఫస్ట్ టైమ్ విదేశీ లొకేషన్కి వెళ్ళింది.
‘ద రాజా సాబ్’ లో ప్రభాస్తో పాటు సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను టీ.జీ. విశ్వ ప్రసాద్ – కృతి ప్రసాద్ నిర్మిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఆల్రెడీ మనం టిజర్ ఇంకా ట్రైలర్ చూసేసాం కదా… అవి రెండు సినిమా పైన అంచనాలు వేరే లెవెల్ కి తీసుకెళ్లాయి… సో, ఇప్పుడు గ్రీస్ లో చిత్రీకరించిన పాట కూడా సినిమా కి మంచి హైప్ ఇస్తుంది…