దేవపూత్తణ ఏకాదశి విశిష్టత

Devuththana Ekadashi 2025 Significance – The Day Lord Vishnu Awakens from Yoga Nidra
Spread the love

హిందూ ధర్మంలో ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే, కార్తీక మాసంలో వచ్చే దేవపూత్తణ (ప్రభోధిని) ఏకాదశి అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. దీనినే బోధన ఏకాదశి, ఉద్దాణ ఏకాదశి, కైశిక ఏకాదశి అని కూడా పిలుస్తారు. శయని ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి యోగనిద్రలోకి ప్రవేశించి, నాలుగు నెలల చాతుర్మాస్యం అనంతరం ఈరోజు మేల్కొంటారని పురాణాలు చెబుతున్నాయి.

ఈ రోజుతో చాతుర్మాస్య వ్రతాలు, దీక్షలు పూర్తి అవుతాయి. భక్తులు విష్ణుమూర్తి మేల్కొన్న రోజుగా దీన్ని జరుపుకుంటారు. ఆలయాల్లో దేవోత్థానం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. తులసి వివాహం కూడా ఈ రోజే ప్రారంభమవుతుంది. విష్ణుమూర్తి నిద్రలేవడం అంటే భౌతికంగా కాదు, సృష్టిలోని చైతన్యం మళ్లీ మేల్కొన్న సంకేతం అని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తారు.

ఈ రోజు ఉపవాసం చేసి, విష్ణు సహస్రనామం, గీతా పారాయణం చేయడం అత్యంత పుణ్యదాయకం. దేవోత్థాన ఏకాదశి వ్రతం ఆచరించడం వలన పాపాలు నశించి, ధన, ఆయుష్షు, సంతోషం లభిస్తాయని నమ్మకం. ఈ రాత్రి జాగరణ చేయడం, దీపాలు వెలిగించడం ద్వారా భక్తి శక్తి మరింత పెరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit