Native Async

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

Tirumala Latest Update: Heavy Rush, Long Waiting Times For Darshan Today
Spread the love

తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. అయితే, శనివారం రోజున సాధారణంగా ఉన్నట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఉచిత దర్శనం కోసం భక్తులు ఈరోజు 15 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది. ఇక రూ. 300 టికెట్‌ కలిగిన భక్తులకు 3 గంటల సమయం, సర్వదర్శనం టోకెన్‌ పొందిన భక్తులకు మూడు నుంచి ఐదు గంటల సమయం పడుతున్నది. శుక్రవారం రోజున స్వామివారిని 67,336 మంది భక్తులు దర్శించుకోగా, 25,063 మంది తలనీలాలు సమర్పించారు. శుక్రవారం హుండీ ద్వారా రూ. 3.68 కోట్ల ఆదాయం లభించినట్టు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit