దేవాలయానికి వెళ్లిన సమయంలో పూజారి మనకు తీర్థం ఇస్తారు. తీర్థాన్ని గోకర్ణముద్ర వేసి తీసుకుంటాం. తీర్థం తీసుకున్న తరువాత చాలా మంది చేతిని తలకు రాసుకుంటారు. జ్యోతిష్య, హైందవ సంప్రదాయాల ప్రకారం తీర్థం పవిత్రమైన జలం. దీనినే గంగాజలం అని కూడా పిలుస్తాం. భగవంతుడిని అభిషేకించిన తరువాత పవిత్రంగా మారిన జలాన్ని తీర్థంగా భక్తులకు అందిస్తారు. తీర్థం తీసుకున్న తరువాత చేతిని తలకు రాయడం ఓ అలవాటుగా మారింది. అయితే, ధర్మశాస్త్రాల ప్రకారం చేతిని తలపై త్రిపుండ్రం లేదా నమస్కారానికి సూచనగా రాయడం ద్వారా శుద్ధి, క్షమాపణ, దైవకృప పొందేందుకు సూచనగా చెబుతారు. తీర్థం అనేది ప్రసాదంగా చెబుతారు కాబట్టి దానిని తలపై ఉంచడం కూడా శుభదాయకమనే చెప్పాలి. ఇక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చూసుకుంటే తీర్థం భౌతిక, మానసిక శరీరాన్ని శుద్ధి చేస్తుంది. పుణ్యఫలాలను ఇస్తుంది. మనిషి తలపై బ్రహ్మరంధ్రం ఉంటుంది. దీనినే శక్తికేంద్రంగా చెబుతాం. తీర్థం తీసుకున్న తరువాత చేతిని తలపై రాయడం వలన బ్రహ్మకేంద్రానికి ఆధ్యాత్మిక శక్తి అందుతుందని, పాపాలు క్షమించబడతాయని చెబుతారు. తీర్థం తీసుకున్న తరువాత ఎవరు తలపై చేతిని రాయకూడదు అనే దానిపై కూడా శాస్త్రాలు కొన్ని వివరణలు ఇచ్చాయి. మనసు మాలిన్యంతో నిండిపోయినవారు, భగవంతునిపై నమ్మకం లేనివారు, పలు రకాలైన చింతలున్నవారు చేతిని తలపై రాకూడదని చెబుతారు.
Related Posts

నవదేవి సంప్రదాయంః శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతార రహస్యం
Spread the loveSpread the loveTweetదుర్గానవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజైన నేడు నవదుర్గా సంప్రదాయం ప్రకారం భక్తులు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా ఆరాధిస్తారు. అమ్మవారు సమస్తలోకాలకు అధిష్టాన దేవత.…
Spread the love
Spread the loveTweetదుర్గానవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజైన నేడు నవదుర్గా సంప్రదాయం ప్రకారం భక్తులు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా ఆరాధిస్తారు. అమ్మవారు సమస్తలోకాలకు అధిష్టాన దేవత.…

దసరా శరన్నవరాత్రులుః కనకదుర్గాదేవి అలంకరణ రహస్యం
Spread the loveSpread the loveTweetదసరా శరన్నవరాత్రుల్లో తొమ్మిదోరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు కనకదుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. ఈరోజు మహా దుర్గాష్టమి కావడంతో అమ్మవారిని శోభాయమానమైన రత్నాలంకారాలతో అలంకరిస్తారు.…
Spread the love
Spread the loveTweetదసరా శరన్నవరాత్రుల్లో తొమ్మిదోరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు కనకదుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. ఈరోజు మహా దుర్గాష్టమి కావడంతో అమ్మవారిని శోభాయమానమైన రత్నాలంకారాలతో అలంకరిస్తారు.…

తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సోమవారం సేవలు
Spread the loveSpread the loveTweetతిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలు అత్యంత ఖచ్చితంగా ప్రతిరోజూ జరుగుతుంటాయి. అయితే ప్రతి వారంలో ప్రతి రోజుకు ప్రత్యేకత ఉంటుంది. సోమవారం రోజున…
Spread the love
Spread the loveTweetతిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలు అత్యంత ఖచ్చితంగా ప్రతిరోజూ జరుగుతుంటాయి. అయితే ప్రతి వారంలో ప్రతి రోజుకు ప్రత్యేకత ఉంటుంది. సోమవారం రోజున…