
AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో గురువారం సాయంత్రం బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రెటరీ శ్రీ ఎన్.మధుకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్.ఎస్.ఎస్. చీఫ్ శ్రీ మోహన్ భగవత్ గారు ఆదివాసీ యోధుడు బిర్సా ముండా గురించి రాసిన పుస్తకాన్ని శ్రీ పవన్ కల్యాణ్ గారికి అందించారు.

వీటితోపాటు భారత భారతి సంస్థ స్వాతంత్ర్య సమరయోధుల జీవితాల గురించి ప్రచురించిన 175 పుస్తకాలను ఇచ్చారు. బిర్సా ముండా జయంతి వేడుకల గురించీ, స్వదేశీ వస్తువుల వినియోగాన్ని విస్తృతం చేయడం గురించి ఉప ముఖ్యమంత్రి చర్చించారు.