50 పైసల నాణెం చెల్లుబాటులో ఉందా? ఆర్బీఐ ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా నాణేల చెల్లుబాటు గురించి తరచూ వచ్చే సందేహాలు, సోషల్ మీడియాలో వ్యాపించే వదంతులను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పిస్తోంది. భారతీయ కరెన్సీ వ్యవస్థలో నాణేల ప్రాముఖ్యతను వివరించేందుకు ఆర్‌బీఐ ఇటీవల ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ముఖ్యంగా 50 పైసల నాణెం చెల్లుబాటులో లేదా? అన్న ప్రశ్నకు సమాధానంగా, 50 పైసలు సహా దేశంలో ముద్రింపులో ఉన్న నాణేలు అన్నీ చట్టబద్ధంగా చలామణిలోనే ఉన్నాయని స్పష్టం చేసింది.

ఆర్‌బీఐ మరోసారి గుర్తు చేసింది—
50 పైసలు, ₹1, ₹2, ₹5, ₹10, ₹20 నాణేలు అన్ని చెల్లుబాటైన కరెన్సీ.
వాటి పరిమాణం, బరువు, డిజైన్ మారుతూ ఉండటం సహజమని, కానీ ఎటువంటి నాణెం కూడా చెల్లుబాటులో నుండి తొలగించలేదని తెలిపింది.

గతంలో ₹10 నాణెం చెల్లదన్న వదంతులు విస్తారంగా ప్రచారంలోకి వచ్చాయి. వాట్సాప్ సందేశాలు, సోషల్ మీడియా పోస్టులు కారణంగా చాలా చోట్ల వ్యాపారులు కూడా ఆ నాణెం స్వీకరించడానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఆ ప్రచారాన్ని ఖండిస్తూ, ₹10 నాణెం పూర్తిగా చెల్లుబాటులో ఉందని పదేపదే స్పష్టం చేసింది. అయినా చాలామంది సందేహంతో స్వీకరించకపోవడం గమనార్హం.

ప్రస్తుతం అదే పరిస్థితి 50 పైసల నాణెంపై కూడా కనిపిస్తోంది. దీనిపై వచ్చిన సందేహాలు, వదంతులను అరికట్టేందుకు ఆర్బీఐ మళ్లీ స్పష్టమైన ప్రకటన చేసింది. ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) ప్లాట్‌ఫారమ్‌లో, వాట్సాప్ సందేశాల ద్వారా కూడా అధికారిక సమాచారాన్ని అందించింది. ఏ డిజైన్‌లో ఉన్నా, పాత 50 పైసల నాణెం కూడా చెల్లుబాటు అవుతుంది, వ్యాపారులు మరియు ప్రజలు ఎలాంటి సందేహం లేకుండా స్వీకరించాలని స్పష్టం చేసింది.

కరెన్సీ వ్యవస్థలో నాణేలు అత్యంత ముఖ్యమైన భాగం. రోజువారీ లావాదేవీల కోసం ఆర్బీఐ వీటిని సుదీర్ఘకాలం చలామణిలో ఉంచుతుంది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే అపోహలను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ఆర్బీఐ సూచిస్తోంది.

ఇదే సరైన సమయం… విశాఖలో మీ కలల ఇంటిని ఇలా సొంతం చేసుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *