తుమ్మిపువ్వులు గడ్డిజాతికి చెందిన మొక్కలు. సాధారణంగా ఇవి రోడ్డు పక్కన, పొలం గట్లమీద పెరుగుతుంటాయి. వీటిని మనం పెద్దగా పట్టించుకోం. కానీ, ఈ పువ్వులు మహాశివుడిని అత్యంత ఇష్టమైనవిగా చెబుతారు. ఈ తుమ్మి పువ్వులను భూతనాశక అని పురాణాలు చెబుతున్నాయి. ఇది చెడు శక్తులను తొలగించే శక్తి కలిగి ఉందని విశ్వాసం. ఈ పువ్వుల పేరుమీదగానే శివుడిని భూతనాధుడు అని పిలుస్తారు. భూతగణాలకు ఆయన అధిపతి. తుమ్మి పువ్వులు భూతగణాలను ప్రసన్నం చేస్తాయని, అందువలన శివుడి ఆరాధనలో వీటిని ఉపయోగిస్తారు. తుమ్మిచెట్టు శరీరాన్ని శుద్ధి చేసే తత్వాన్ని, రోగనాశనం చేసే గుణాలను కలిగి ఉంటుంది. మహాశివుడు శుద్దతకు ప్రతీక. అందుకే ఈ పువ్వులు శివారాధనలో తప్పకుండా ఉపయోగించాలని అంటారు. శివుని పూజలు తుమ్మి పువ్వులను సమర్పించడం వలన దోషాలు తొలగిపోతాయి. చేసిన పాపాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు. అలంకరణ తత్వం లేని భగవంతుడు మహాశివుడు. అందుకే చిన్నదైన, సాధారణమైన తుమ్మిపువ్వును మహాశివుడిని శ్రద్ధతో సమర్పిస్తే ఆయన తృప్తి చెందుతారని, భక్తులను అనుగ్రహిస్తారని భక్తుల నమ్మకం. ఒక్క తుమ్మిపువ్వుతో శివుడిని పూజిస్తే సహస్ర పుష్పార్చన చేసిన ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
Related Posts
భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం…ఢీకొట్టే ప్రమాదం ఉందా?
భూమికి అత్యంత సమీపంగా ఒక భారీ గ్రహశకలం రాబోతోందనే వార్త ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. 99942 అపోఫిస్గా పిలిచే ఈ గ్రహశకలం 2029 ఏప్రిల్ 13న భూమికి…
భూమికి అత్యంత సమీపంగా ఒక భారీ గ్రహశకలం రాబోతోందనే వార్త ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. 99942 అపోఫిస్గా పిలిచే ఈ గ్రహశకలం 2029 ఏప్రిల్ 13న భూమికి…
హతవిధి… ఇలా వంటచేస్తే..సచ్చుడే
వంట చేయడం ఒక ఆర్ట్. ఇది అందరికీ రాదు. మనవాళ్లంతా వంట చేయడం చాలా ఈజీ. ఏముంది గిన్నెలో రైస్ వేసి అందులో నీళ్లుపోసి పోయిమీద పెడితే…
వంట చేయడం ఒక ఆర్ట్. ఇది అందరికీ రాదు. మనవాళ్లంతా వంట చేయడం చాలా ఈజీ. ఏముంది గిన్నెలో రైస్ వేసి అందులో నీళ్లుపోసి పోయిమీద పెడితే…