జాతకంలో అన్నిగ్రహాలు అనుకూలంగా ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుంది. ఏ గ్రహమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటే దాని ప్రభావం జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా బుధగ్రహం అనుకూలంగా లేకుంటే బుద్ధి, వ్యాపారం, విద్య, వాణిజ్యం, లావాదేవీల వంటి రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నిర్ణయాలలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఆలోచనలు అస్పష్టంగా ఉంటాయి. చదువు పట్ల శ్రద్ధ తగ్గిపోతుంది. పరీక్షల్లో విఫలం అవుతుంటారు. తెలివితేటలు క్రమంగా తగ్గిపోతుంటాయి. మాటల్లో తప్పులు దొర్లుతుంటాయి. అపార్థాలకు తావుంటుంది. సంబంధాల్లో విబేధాలు కలుగుతాయి. వ్యాపారంలో నష్టాలు తప్పకపోవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో మోసాలు జరుగుతాయి. బుధుడి అనుగ్రహం లేకుంటే నాడీ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. మతిమరుపుతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చర్మసంబంధిత వ్యాధులతో సతమతమౌతారు. బుధగ్రహ దోషాలను నివారించాలంటే ప్రతిరోజూ ఓం బ్రాం బ్రీం బ్రౌం సం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. బుధవారం రోజున ఉపవాసం ఉంటూ పచ్చి మొక్కజొన్నను, పచ్చి కూరగాయలను దానం చేయాలి. బుధవారం రోజున పచ్చని దుస్తులు ధరించాలి. బుధవారం రోజున తులసిమొక్క దగ్గర దీపం వెలిగించాలి. వీలైనంత వరకు చదువుపై దృష్టిపెట్టాలి. ఏ విషయంపైనైనా సరే స్పష్టంగా మాట్లాడటం నేర్చుకోవాలి.
Related Posts

ఇంద్రకీలాద్రి దేవీ నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాలు ఇవే
Spread the loveSpread the loveTweetఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి నవరాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ నవరాత్రోత్సవాలు అక్టోబర్ 2 వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రతీ ఏడాది అమ్మవారిని…
Spread the love
Spread the loveTweetఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి నవరాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ నవరాత్రోత్సవాలు అక్టోబర్ 2 వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రతీ ఏడాది అమ్మవారిని…

వాస్తు ప్రకారం వంటగది ఇలా లేకుంటే…జీవితంలో అన్నీ కష్టాలే
Spread the loveSpread the loveTweetఇంటి విషయంలో వాస్తు పక్కాగా ఉండాలి. ఏ మాత్రం తేడాగా ఉన్నా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆర్థికంతో పాటు సామాజికంగా, కుటుంబపరంగా కూడా…
Spread the love
Spread the loveTweetఇంటి విషయంలో వాస్తు పక్కాగా ఉండాలి. ఏ మాత్రం తేడాగా ఉన్నా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆర్థికంతో పాటు సామాజికంగా, కుటుంబపరంగా కూడా…

కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ స్వామి…దర్శించుకున్నవారి జన్మధన్యం సుమీ
Spread the loveSpread the loveTweetశ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు వైభోగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగోరోజైన శనివారం రోజు తిరుమల క్షేత్రం భక్తులతో కళకళలాడింది. ఉభయ దేవేరులతో కలిసి రాజమన్నార్ ఆలంకారంలో,…
Spread the love
Spread the loveTweetశ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు వైభోగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగోరోజైన శనివారం రోజు తిరుమల క్షేత్రం భక్తులతో కళకళలాడింది. ఉభయ దేవేరులతో కలిసి రాజమన్నార్ ఆలంకారంలో,…