ఏపీలో మరో కొత్త పథకం… వారి అకౌంట్లో రూ. 10వేలు జమ

Andhra Pradesh Government Launches ‘Garuda’ Scheme, Rs 10,000 Aid to Beneficiaries’ Accounts

సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయంతో ముందుకొచ్చింది. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఇప్పటికే అమలులో ఉన్న పథకాలకు మరింత బలం చేకూర్చడంతో పాటు, కొత్త పథకాల రూపకల్పనలోనూ ప్రభుత్వం వేగం పెంచింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఊరట కలిగించేలా ‘గరుడ’ అనే కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఈ పథకం ప్రధానంగా పేద బ్రాహ్మణ కుటుంబాల్లో అనుకోని మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించేందుకు రూపొందించబడింది. కుటుంబంలో ఎవరైనా వ్యక్తి మృతి చెందితే, బాధిత కుటుంబానికి రూ.10 వేల నగదు సాయాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. కష్టకాలంలో కనీస భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

గరుడ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలపై ఇప్పటికే కసరత్తు మొదలైంది. అమరావతిలో జరిగిన సమావేశంలో మంత్రి సవిత, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్ ఈ పథకం అమలు తీరుపై విస్తృతంగా చర్చించారు. త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో బ్రాహ్మణుల కోసం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయి. కొన్నేళ్లుగా నిలిచిపోయిన ఆ పథకాలను మళ్లీ పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బ్రాహ్మణ కుటుంబాల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని మంత్రి సవిత భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *