జగ్గన్నతోట ఏకాదశ రుద్రోత్సవం… సంక్రాంతికి ప్రభల తీర్థం చూసి తీరాల్సిందే

Prabala Teertham of Konaseema The 450-Year-Old Ekadasha Rudra Festival of Spiritual Grandeur

ఆధునిక జీవనశైలి ఎంత వేగంగా మారుతున్నా… కోనసీమ గడ్డపై సంక్రాంతి వచ్చిందంటే సంప్రదాయం తన అసలైన రూపంలో వెలుగులోకి వస్తుంది. ఆ సంప్రదాయానికి ప్రాణం పోసే మహోత్సవమే జగ్గన్నతోట ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థం. పచ్చని పైరుపంటల మధ్య, కొబ్బరిచెట్ల నీడలో జరిగే ఈ తీర్థం భక్తులకు ఓ ఆధ్యాత్మిక అనుభూతి.

సుమారు 450 ఏళ్లుగా గుడి, గోపురం లేకుండానే కొనసాగుతున్న ఈ ప్రభల తీర్థం మకర సంక్రాంతి కనుమ నాడు నిర్వహించబడటం విశేషం. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏకాదశ రుద్రులు ఇక్కడ కొలువుతీరుతారనే విశ్వాసం కోనసీమ ప్రజల మనసుల్లో గాఢంగా నాటుకుపోయింది. ప్రభలను అలంకరించి, రెండెడ్ల బళ్లపై ఊరేగిస్తూ జగ్గన్నతోటకు తీసుకువచ్చే దృశ్యాలు కన్నుల పండువగా ఉంటాయి.

ప్రభలను భుజాలపై మోస్తూ, నదులను దాటిస్తూ తీసుకువచ్చే యువకుల ఉత్సాహం, భక్తుల శరణుఘోషలు ఈ ఉత్సవానికి మరింత శోభనిస్తాయి. వ్యాఘ్రేశ్వరుడు మొదలుకుని త్ర్యంబకేశ్వరుడివరకు 11 మంది రుద్రులను దర్శించుకోవడం మహాపుణ్యంగా భావిస్తారు.

భక్తి, సంప్రదాయం, సంస్కృతి మేళవించిన ఈ ప్రభల తీర్థం… కోనసీమ ఆత్మకు ప్రతిరూపం. ప్రతి ఏడాది సంక్రాంతికి ఇది ఇచ్చే ఆధ్యాత్మిక విందు మాటల్లో వర్ణించలేనిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *