కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన తొలినాళ్లలో అధికారం కోసం అంతర్గత కుమ్ములాటలు జరిగిన సంగతి తెలిసిందే. అధిష్టానం జోక్యంతో ఈ కుమ్ములాటలకు చెక్ పడింది. కాగా, తాజాగా మరోసారి ఇంటి గొడవలు రచ్చకెక్కడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలపై కర్ణాటక మంత్రి రాజన్న స్పందించిన తీరు సరిగా లేదనే కారణంగా ఆయన్ను పదవి నుంచి తప్పించింది. పార్టీ నుంచి తప్పించడంతో ఆయన వేరు కుంపటి పెట్టుకునేందుకు సిద్దమౌతున్నారని, కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరబోతున్నారని, బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో మాజీ మంత్రి రాజన్న కూడా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హెసీ బాలకృష్ణ ఆరోపించారు. కాగా, ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నేత, రాజన్న కుమారుడు రాజేంద్ర రాజన్న తిప్పికొట్టారు. బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో హెసీ బాలకృష్ణ కూడా ఉన్నారని, ఆయనే కావాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, తన తండ్రికి పార్టీ మారే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. చాలా కాలం తరువాత మరోసారి రాజకీయంగా కర్ణాటకలో దుమారం రేగడంతో ఈ దుమారం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.
Related Posts
నిన్న జరిగిన ‘జీఎస్టీ 2.0’ సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే సంస్కరణ అంటున్న పవన్ కళ్యాణ్…
Spread the loveSpread the loveTweetమన దేశ ప్రధాని మోడీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చే గౌరవం, విలువ చూస్తుంటే ముచ్చట వేస్తుంది… అయ్యో హైదరాబాద్ లాగ AP కూడా…
Spread the love
Spread the loveTweetమన దేశ ప్రధాని మోడీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చే గౌరవం, విలువ చూస్తుంటే ముచ్చట వేస్తుంది… అయ్యో హైదరాబాద్ లాగ AP కూడా…
మంటల్లో కాలిబూడిదైన ఇటలీ బెర్నాగా కోట
Spread the loveSpread the loveTweetఇటలీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లాంబార్డీ (Lombardy) ప్రాంతంలో 1628 సంవత్సరంలో స్థాపించబడిన చారిత్రక “బెర్నాగా కోట (Bernaga Monastery)” అగ్నికి ఆహుతైంది.…
Spread the love
Spread the loveTweetఇటలీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లాంబార్డీ (Lombardy) ప్రాంతంలో 1628 సంవత్సరంలో స్థాపించబడిన చారిత్రక “బెర్నాగా కోట (Bernaga Monastery)” అగ్నికి ఆహుతైంది.…
భారత్తో యూకే సరికొత్త మైత్రి
Spread the loveSpread the loveTweetయూకే ప్రధాని కియర్ స్టార్మర్ భారత పర్యటనకు వచ్చారు. ఈరోజు ఉదయం ఆయన ముంబైలోని చత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. అయితే, ఆయనతో…
Spread the love
Spread the loveTweetయూకే ప్రధాని కియర్ స్టార్మర్ భారత పర్యటనకు వచ్చారు. ఈరోజు ఉదయం ఆయన ముంబైలోని చత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. అయితే, ఆయనతో…