Native Async

అమెరికా, రష్యాలను వెనక్కనెట్టి…రెండోస్థానానికి చేరిన భారత్‌ రైల్వే

Indian Railways Becomes World’s 2nd Largest Rail Freight Carrier in FY 2024–25, Surpassing USA and Russia
Spread the love

భారత రైల్వే వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ప్రజారవాణా వ్యవస్థలో మూడో స్థానంలో ఉన్న భారత్‌ తాజాగా సరుకుల రవాణాలో రెండో స్థానానికి చేరుకుంది. 2024-25వ సంవత్సరానికి గాను ఈ ప్రగతి సాధించింది. భారత్‌ కంటే ముందున్న రష్యా, అమెరికాలను దాటేసి రెండో స్థానానికి చేరుకుంది. అయితే, 4 బిలియన్‌ మెట్రిక్‌ టన్నుల రవాణాతో చైనా మొదటి స్థానంలో ఉండటం విశేషం.

ఇక గణాంకాల పరంగా చూసుకుంటే రెండో స్థానంలో ఉన్న భారత్‌ 1.6 బిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరుకులను రవాణా చేయగా, మూడో స్థానంలో ఉన్న అమెరికా 1.5 బిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరుకులను రవాణా చేసింది. ఇక నాలుగో స్థానంలో ఉన్న రష్యా 1.1 బిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరుకులను రవాణా చేసినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. దీనిని బట్టి చూస్తే భారతీయ రైల్వే వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందని, ఆర్థిక వ్యవస్థలో సామర్థ్యం గణనీయంగా పెరుగుతోందని స్పష్టమౌతోంది.

తిరుమలలో వివాహానికి మార్గాలు ఇవే

పెరుగుతున్న సామర్థ్యం – మారుతున్న రవాణా రూపం

ఇటీవలి కాలంలో రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు, డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌లు (DFC), కొత్త బోగీలు, అధునాతన లోకోమోటివ్స్‌ వంటి సాంకేతిక మార్పులు ఈ విజయానికి ప్రధాన కారణమని అధికారులు పేర్కొంటున్నారు. సరుకు రవాణా కోసం ప్రత్యేక మార్గాలు, సమయపాలన, వేగం పెంపు వంటి చర్యలు రైల్వే పనితీరును ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాయి.

ఆర్థిక ప్రగతికి వెన్నెముక

భారత రైల్వేలు దేశ ఆర్థిక వృద్ధికి కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. కోల్‌, ఇనుము, సిమెంట్‌, ఎరువులు, ధాన్యాలు వంటి వస్తువుల రవాణాలో రైల్వేలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. రోడ్డు రవాణాతో పోలిస్తే రైలు ద్వారా సరుకు రవాణా తక్కువ ఖర్చుతో, పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది.

గ్లోబల్‌ గుర్తింపు

భారత రైల్వేలు ఈ స్థాయి సాధించడం ద్వారా సుస్థిర రవాణా వ్యవస్థలో ప్రపంచంలో రెండో స్థానానికి చేరడం గర్వకారణం. పర్యావరణ అనుకూల రవాణా విధానాలు, గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు, ఎలక్ట్రిఫికేషన్‌ వేగం వంటి చర్యలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నాయి.

భవిష్యత్‌ లక్ష్యాలు

రాబోయే సంవత్సరాల్లో భారత్‌ రైల్వే 2 బిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా లక్ష్యం పెట్టుకుంది. దీనికి అనుగుణంగా డిజిటలైజేషన్‌, ఆటోమేషన్‌, ప్రైవేట్‌ లాజిస్టిక్స్‌ భాగస్వామ్యాలు మరింత పెరగనున్నాయి. ఈ విజయంతో భారత రైల్వే కేవలం రవాణా వ్యవస్థగానే కాకుండా, దేశ ఆర్థిక శక్తి ప్రతీకగా మారిందని చెప్పాలి. సరుకుల రవాణాలో వేగం పుంజుకున్న భారతీయ రైల్వే వ్యవస్థ అటు ప్రయాణికుల రవాణా విషయంలోనూ దూసుకుపోతున్నది. ఇప్పటికే వందేభారత్‌, వందే భారత్‌ స్లీపర్‌ వంటి వాటిని ప్రవేశపెట్టగా త్వరలోనే సెమీ హైస్పీడ్‌ రైళ్లు కూడా దేశంలో పరుగులు తీయనున్నాయి. వేగవంతమైన రవాణా ఉన్నప్పుడే దేశం అన్నివిధాలుగా అభివృద్ధి సాధిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit