Native Async

చిత్తూరు జిల్లాలో రేపు స్కూళ్లు బంద్‌

Heavy Rain in Chittoor District Schools and Colleges Closed Tomorrow, October 23
Spread the love

చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. ఈ వర్షం కారణంగా రోడ్లు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు అంటే అక్టోబర్‌ 23వ తేదీ జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాద్యాయులు, మండల విద్యాశాఖాధికారులకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. ఈశాన్య రుతుపవనాలు, బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా తమిళనాడు, రాయలసీమ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

ఆఫ్ఘాన్‌ శరణార్థులకు పాకిస్తాన్‌ అల్టిమేటం – దేశం విడిచి వెళ్లాలని ఆదేశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *