Native Async

నీటితోనే ఈ ఆలయంలో దీపం వెలిగిస్తారు?

Temple Where Lamps Are Lit with Water Instead of Oil The Miracle of Ghadiaghat Wali Mata Temple in Madhya Pradesh
Spread the love

నూనె అందుబాటులో లేనప్పుడు సాయిబాబా తన చావడిలో నీటితో దీపాలను వెలిగించాడని సాయి సత్‌చరిత్రలో మనం చదువుకున్నాం కదా. ఆ కాలంలోని వాళ్లు దానిని ప్రత్యక్షంగా చూసుండొచ్చు. కానీ, ఈ కాలంలో మనం ఎవరం కూడా అటువంటిదానిని చూడలేదు. అయితే, ఇలాంటి అద్భుతాన్ని చూడాలంటే మనం మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌ జిల్లాలోని నల్ఖేడా సమీపంలో కాళీసింధ్‌ అనే నది ఉంది. ఈ నది ఒడ్డున గడియాఘాట్ వలీ మాతాజీ ఆలయం ఉంది. ఈ ఆలయానికి ప్రతిరోజూ వందలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఈ ఆలయంలో నిత్యం ఓ అద్భుతం చోటు చేసుకుంటుంది. ప్రతిరోజూ సాయంత్రం సమయంలో అమ్మవారి ముందు ఓ దీపం వెలిగిస్తారు. ఈ దీపం మరుసటిరోజు సాయంత్రం వరకు వెలుగుతూనే ఉంటుంది.

Panchangam: ఈరోజు శుభముహూర్తాలు

ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా ఇక్కడే ఉంది అసలైన రహస్యం. అమ్మవారి ముందు వెలిగించే దీపంలో పోసేది నూనె కాదు..నీరు. ఈ నీటిని కాళీసింధ్‌ నది నుంచి తీసుకొస్తారు. ఇలా తీసుకొచ్చిన నీటిని అమ్మవారి ముందు ఉంచిన దీపం కుందిలో పోస్తారు. ఇలా పోసిన కాసేపటి తరువాత ఆ నీరు ఓ రకమైన జిగట పదార్థంగా మారుతుంది. ఆ తరువాత దీపం వెలిగిస్తే వెలుగుతుంది. ఇలా వెలిగిన దీపం ఆ ప్రమిదలోని నీరు మొత్తం ఆవిరయ్యే వరకు వెలుగుతుంది. ఇదెలా సాధ్యమన్నది శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేకపోయారు. ఈ నీటితో మరోచోట దీపం వెలిగిస్తే వెలగదట. ఈ అమ్మవారి ఆలయంలో మాత్రమే దీపం వెలుగుతుంది. అయితే, వర్షాకాలంలో ఈ ఆలయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ దీపాన్ని వెలిగించరు. కారణం కాళీసింద్‌ నదిలోని నీరు ఆలయంలోకి ప్రవేశించడమే. నీటితో వెలిగే దీపాన్ని చూడాలంటే మనం తప్పకుండా మధ్యప్రదేశ్‌ వరకు వెళ్లి తీరాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit