ధనుష్ ఇంకా మృణాల్ ఠాకూర్ డేటింగ్లో ఉన్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఇద్దరూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టబోతోందన్న ఊహాగానాలు ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ సినిమాల పనుల్లో బిజీగా ఉండటంతో, ఈ వార్తలపై స్పష్టత లేదు.
గతేడాది ఆగస్టులో ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రీమియర్కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. ఆ సమయంలో ఈ విషయంపై ప్రశ్నించగా, మృణాల్ ఠాకూర్ ధనుష్ తనకు “మంచి స్నేహితుడు మాత్రమే” అని స్పష్టం చేసింది. ఆ ప్రీమియర్కు ధనుష్ను తన సహనటుడు అజయ్ దేవగన్ ఆహ్వానించాడని కూడా ఆమె వెల్లడించింది.

ఫ్రీ ప్రెస్ జర్నల్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం, మృణాల్ ఠాకూర్ ఇంకా ధనుష్ ఫిబ్రవరి 14న వివాహం చేసుకోబోతున్నారట. అయితే ఈ వార్తలపై ఇప్పటికీ ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. టెలివిజన్ రంగంలో కెరీర్ను ప్రారంభించిన మృణాల్, ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఆమె ‘సీతా రామం’ సినిమాతో అరంగేట్రం చేసింది.
ధనుష్ 2004 నవంబర్ 18న సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు యాత్ర, లింగా – ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే 2022 జనవరి 17న వీరిద్దరూ విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు మృణాల్తో ఆయన పేరు వినిపించడం ఇండస్ట్రీలో మరోసారి చర్చకు దారితీస్తోంది.