ఇది కేరళ కాదు… సంక్రాంతికి ఆంత్రేయపురం

Athreyapuram Boat Races Turn Sankranti Celebrations into a Grand Festive Spectacle in Andhra Pradesh

ఇది కేరళ కాదు… ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్రేయపురం. సంక్రాంతి పండుగ వేళ ఇక్కడి వాతావరణం పండుగ ఉత్సాహంతో కళకళలాడింది. పచ్చని పొలాలు, కాలువల వెంట కొబ్బరి చెట్లు, గ్రామీణ జీవనశైలి కలిసి ఆత్రేయపురాన్ని ఒక ప్రత్యేక పర్యాటక కేంద్రముగా మార్చాయి. ఈ అందాలను చూసిన చాలామందికి కేరళను తలపించే దృశ్యాలు కనువిందు చేశాయి.

సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆత్రేయపురంలో నిర్వహించే పడవ పందేలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ పడవ పందేలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కాలువల్లో వేగంగా దూసుకెళ్లే పడవలు, వాటిని నడిపే యువకుల ఉత్సాహం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ పడవ పందాలకు తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి గుర్తింపు ఉండటం విశేషం.

ఈ సంప్రదాయ క్రీడపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్‌ ప్రత్యేకంగా స్పందించారు. ఆత్రేయపురం పడవ పందేలను ఆయన ‘ఎక్స్‌’ వేదికగా పంచుకుంటూ, గ్రామీణ సంస్కృతి గొప్పతనాన్ని ప్రశంసించారు. పండుగ ఆనందం, పల్లె సంప్రదాయాలు, ప్రజల ఉత్సాహం కలిసి ఆత్రేయపురాన్ని ఈ సంక్రాంతికి ప్రత్యేక ఆకర్షణగా నిలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *