తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ఎన్నో సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. షెల్టర్లు, షెడ్డులు, ఉచిత మంచినీరు, ఉచిత భోజనంతో పాటు ఉచిత ప్రయాణ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. స్వామివారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే, శ్రీవారి సేవలో తరించే ఉద్యోగుల విషయంలోనూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉద్యోగులకు ఉచిత ఇళ్ల స్థలాలను అందివ్వగా ఇప్పుడు వారి భద్రత కోసం మరిన్ని నిర్ణయాలు తీసుకున్నది. శ్రీవారి ఆలయంలో పనిచేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ద్విచక్రవాహనాలపై వచ్చే ఉద్యోగులకు హెల్మెట్లు అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్వర్యంలో 500 హెల్మెట్లను పంపిణీ చేశారు. అమలాపురం, హైదరాబాద్కు చెందిన భక్తులు రెండువేల హెల్మెట్లను విరాళంగా అందించారు. వీటిని ఉద్యోగులకు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టుగా అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు రాబోయే రోజుల్లో మరో 7500 హెల్మెట్లను కూడా ఉద్యోగులకు అందించనున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరించాలని అధికారులు చెబుతున్నారు. హెల్మెట్లు భక్తి ఉట్టిపడేలా తయారు చేయించారు. కాషాయం రంగులో ఉండే ఈ హెల్మెట్లు ముందు భాగంలో శ్రీవారి తిరునామం ఉండటం విశేషం. టీటీడీ ఉద్యోగులు అని గుర్తుపట్టేందుకు ఈ హెల్మెట్లు చిహ్నంగా మారనున్నాయి.
Related Posts

17 నెలల కాలంలో… చరిత్ర సృష్టించిన అయోధ్య రామాలయం
జనవరి 22, 2024 – చరిత్రను మళ్లీ రాసిన రోజు! అయోధ్య…శతాబ్దాలుగా చర్చలతో, కోర్టు కేసులతో, ఆశలతో నిండి ఉన్న చోటు.ఈ పవిత్ర క్షేత్రంలో 2024 జనవరి…
జనవరి 22, 2024 – చరిత్రను మళ్లీ రాసిన రోజు! అయోధ్య…శతాబ్దాలుగా చర్చలతో, కోర్టు కేసులతో, ఆశలతో నిండి ఉన్న చోటు.ఈ పవిత్ర క్షేత్రంలో 2024 జనవరి…

రథయాత్రలో అద్భుతం… అంబులెన్స్కు దారి ఎలా ఇచ్చారో తెలుసా?
పూరీ జగన్నాథుడి రథయాత్ర కొనసాగుతోంది. పూరీ రథయాత్ర అంటే లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఉత్సవం. ఈ ఉత్సవంలో ఏదైనా సమస్య వస్తే అక్కడి నుంచి బయటపడటం…
పూరీ జగన్నాథుడి రథయాత్ర కొనసాగుతోంది. పూరీ రథయాత్ర అంటే లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఉత్సవం. ఈ ఉత్సవంలో ఏదైనా సమస్య వస్తే అక్కడి నుంచి బయటపడటం…

జూన్ 30 నుంచి శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్కార ఉత్సవాలు
తిరుపతి సమీపంలో ఉన్న పవిత్రక్షేత్రం శ్రీనివాస మంగాపురం ఒక వైష్ణవ భక్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ వెలసి ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు భక్తులకు…
తిరుపతి సమీపంలో ఉన్న పవిత్రక్షేత్రం శ్రీనివాస మంగాపురం ఒక వైష్ణవ భక్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ వెలసి ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు భక్తులకు…