తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ఎన్నో సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. షెల్టర్లు, షెడ్డులు, ఉచిత మంచినీరు, ఉచిత భోజనంతో పాటు ఉచిత ప్రయాణ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. స్వామివారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే, శ్రీవారి సేవలో తరించే ఉద్యోగుల విషయంలోనూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉద్యోగులకు ఉచిత ఇళ్ల స్థలాలను అందివ్వగా ఇప్పుడు వారి భద్రత కోసం మరిన్ని నిర్ణయాలు తీసుకున్నది. శ్రీవారి ఆలయంలో పనిచేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ద్విచక్రవాహనాలపై వచ్చే ఉద్యోగులకు హెల్మెట్లు అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్వర్యంలో 500 హెల్మెట్లను పంపిణీ చేశారు. అమలాపురం, హైదరాబాద్కు చెందిన భక్తులు రెండువేల హెల్మెట్లను విరాళంగా అందించారు. వీటిని ఉద్యోగులకు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టుగా అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు రాబోయే రోజుల్లో మరో 7500 హెల్మెట్లను కూడా ఉద్యోగులకు అందించనున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరించాలని అధికారులు చెబుతున్నారు. హెల్మెట్లు భక్తి ఉట్టిపడేలా తయారు చేయించారు. కాషాయం రంగులో ఉండే ఈ హెల్మెట్లు ముందు భాగంలో శ్రీవారి తిరునామం ఉండటం విశేషం. టీటీడీ ఉద్యోగులు అని గుర్తుపట్టేందుకు ఈ హెల్మెట్లు చిహ్నంగా మారనున్నాయి.
Related Posts

ట్రంప్ టారీఫ్లపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Spread the loveSpread the loveTweetఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న భారత ఉత్పత్తులపై 50% టారిఫ్ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన…
Spread the love
Spread the loveTweetఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న భారత ఉత్పత్తులపై 50% టారిఫ్ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన…

Live: కల్వకుంట్ల కవిత కీలక విషయాలు వెల్లడి
Spread the loveSpread the loveTweetబీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తరువాత కల్వకుంట్ల కవిత ప్రెస్మీట్ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో ఆమె కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.…
Spread the love
Spread the loveTweetబీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తరువాత కల్వకుంట్ల కవిత ప్రెస్మీట్ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో ఆమె కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.…

శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన ఎమ్మెల్సీ నాగ బాబు…
Spread the loveSpread the loveTweetశాసన మండలి సభ్యులు కె. నాగబాబు గురువారం శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. “వర్షాల సమయంలో వరద నీటి కారణంగా ఇబ్బందులకు…
Spread the love
Spread the loveTweetశాసన మండలి సభ్యులు కె. నాగబాబు గురువారం శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. “వర్షాల సమయంలో వరద నీటి కారణంగా ఇబ్బందులకు…