సంక్రాంతి పండుగను స్వగ్రామాల్లో ఆనందంగా జరుపుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణాలు చేస్తున్న నేపథ్యంలో, దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్–విజయవాడ మధ్య మరో 10 సంక్రాంతి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 11 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
ఈ ఏడాది సంక్రాంతి రద్దీ ఎక్కువగా ఉండటంతో ముందుగానే ప్రణాళికలు రూపొందించిన రైల్వే అధికారులు, ఛైర్ కార్తో పాటు జనరల్ బోగీలను ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఛైర్ కార్ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించగా, రిజర్వేషన్ లేని ప్రయాణికుల కోసం జనరల్ బోగీలను కూడా అధికంగా ఉంచడం విశేషం.
జనవరి 11, 12, 13, 18, 19 తేదీల్లో ఉదయం 6.10 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు, అలాగే జనవరి 10, 11, 12, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్కు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
ఇప్పటికే నడుస్తున్న 150కి పైగా అదనపు సంక్రాంతి ప్రత్యేక రైళ్లకు ఇవి అదనంగా ఉండడం ప్రయాణికులకు ఊరట కలిగిస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్పై భారం తగ్గించేందుకు చర్లపల్లి, బేగంపేట్, హైటెక్ సిటీ, లింగంపల్లి వంటి స్టేషన్ల నుంచి రైళ్లను ప్రారంభించేలా రైల్వే శాఖ జాగ్రత్తలు తీసుకుంది. సంక్రాంతి వేళ ఈ ఏర్పాట్లు ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.