కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన తొలినాళ్లలో అధికారం కోసం అంతర్గత కుమ్ములాటలు జరిగిన సంగతి తెలిసిందే. అధిష్టానం జోక్యంతో ఈ కుమ్ములాటలకు చెక్ పడింది. కాగా, తాజాగా మరోసారి ఇంటి గొడవలు రచ్చకెక్కడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలపై కర్ణాటక మంత్రి రాజన్న స్పందించిన తీరు సరిగా లేదనే కారణంగా ఆయన్ను పదవి నుంచి తప్పించింది. పార్టీ నుంచి తప్పించడంతో ఆయన వేరు కుంపటి పెట్టుకునేందుకు సిద్దమౌతున్నారని, కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరబోతున్నారని, బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో మాజీ మంత్రి రాజన్న కూడా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హెసీ బాలకృష్ణ ఆరోపించారు. కాగా, ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నేత, రాజన్న కుమారుడు రాజేంద్ర రాజన్న తిప్పికొట్టారు. బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో హెసీ బాలకృష్ణ కూడా ఉన్నారని, ఆయనే కావాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, తన తండ్రికి పార్టీ మారే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. చాలా కాలం తరువాత మరోసారి రాజకీయంగా కర్ణాటకలో దుమారం రేగడంతో ఈ దుమారం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.
Related Posts

నాట నాటు సాంగ్ పాప్ సింగర్ భద్రతపై ఆందోళన
Spread the loveSpread the loveTweetదక్షిణ కొరియాలో ప్రముఖుల భద్రతా సమస్య మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగిన బీటీఎస్ (BTS) స్టార్ జియోన్…
Spread the love
Spread the loveTweetదక్షిణ కొరియాలో ప్రముఖుల భద్రతా సమస్య మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగిన బీటీఎస్ (BTS) స్టార్ జియోన్…

శివభక్తులకు గుడ్న్యూస్ః సోమ్నాథ్ నుంచి రుద్రాక్షను ఇలా అందుకోండి
Spread the loveSpread the loveTweetచారిత్రక నేపథ్యం – సోమనాథ మహాదేవుడి పవిత్ర ఆలయం భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో అతి ప్రధానమైనదిగా చెప్పబడే సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని గిర్…
Spread the love
Spread the loveTweetచారిత్రక నేపథ్యం – సోమనాథ మహాదేవుడి పవిత్ర ఆలయం భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో అతి ప్రధానమైనదిగా చెప్పబడే సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని గిర్…

టీటీడీ కీలక నిర్ణయంః భక్తుల కోసం నూతన కాటేజీల నిర్మాణం
Spread the loveSpread the loveTweetశ్రీవారి దర్శనార్థంగా తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు మరింత సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఓ కీలక నిర్ణయం…
Spread the love
Spread the loveTweetశ్రీవారి దర్శనార్థంగా తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు మరింత సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఓ కీలక నిర్ణయం…