కర్మలు జ్ఞానంతో ఎలా కాలిపోతాయి..శ్రీకృష్ణుడు చెప్పిన సత్యం ఇదే

మన జీవితంలో ప్రతి క్షణం కర్మలతో నిండివుంటుంది. మనం చేసే ప్రతి పని, మాట, ఆలోచన కూడా ఒక కర్మే. కానీ ఆ కర్మలు మనల్ని బంధించకుండా వాటిని జ్ఞానాగ్నిలో కాల్చేయడం ఎలా సాధ్యం? అనే ప్రశ్నకు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇచ్చిన సమాధానం జీవిత మార్మికం.

పోక్సో చట్టంపై సుప్రీంలో కీలక విచారణలు

“ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్యం చేయడం”నే జ్ఞానం. మనం చేసే ప్రతి పనిని యజ్ఞంగా భావించి, దాని ఫలితంపై ఆసక్తి లేకుండా చేస్తే, ఆ కర్మ మనపై ప్రభావం చూపదు. అంటే, మనం పనిచేసి ఫలితం గురించి ఆందోళన చెందకపోతే, ఆ పని జ్ఞానరూపమవుతుంది. ఆ జ్ఞానం కర్మలను కాల్చేస్తుందని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు.

ఉదాహరణకు, తల్లి తన పిల్లల కోసం వండుతుంది. ఆమెకు ప్రతిఫలం కోసం కాకుండా ప్రేమతో చేస్తుంది. అదే యజ్ఞభావం. అలాగే మనం కూడా ప్రతి పనిని స్వార్థం లేకుండా, సమర్పణతో చేస్తే… అది కర్మ కాదు, ఆత్మశుద్ధి సాధన అవుతుంది.

మనం సృష్టిని నియంత్రించలేము, కానీ మన కర్మలను శుద్ధిచేయగలం. ధర్మబద్ధంగా, నిరహంకారంగా చేసిన పని ఆత్మకు బంధనాలు కలిగించదు. అదే జ్ఞానాగ్ని అని భగవద్గీత చెబుతోంది.

కాబట్టి కర్మలు జ్ఞానంలో కాలిపోవడం అంటే పనులు లేకపోవడం కాదు… జ్ఞానంతో చేసిన పనులు పాపబంధం లేకుండా శుద్ధి చెందడం. ఇదే శ్రీకృష్ణుడు చెప్పిన అసలైన సత్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *