దేశంలో తొలి డ్రెవర్‌లెస్‌ కారు…

భారతీయ సాంకేతిక రంగంలో మరో చారిత్రాత్మక అడుగు పడింది. బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (IISc), విప్రో, అలాగే ఆర్వీ ఇంజినీరింగ్‌ కళాశాల సంయుక్తంగా దేశంలోనే తొలి డ్రైవర్‌లెస్‌ కారును (Driverless Car) ఆవిష్కరించాయి. ఇది స్వయంచాలకంగా నడిచే, కృత్రిమ మేధస్సు ఆధారిత (AI-powered Autonomous Vehicle) వాహనం.

ఈ కార్‌ అభివృద్ధికి సుమారు మూడు సంవత్సరాలపాటు పరిశోధన, ప్రోటోటైప్‌ టెస్టింగ్‌, సాఫ్ట్‌వేర్‌ సిమ్యులేషన్లు జరిగాయి. కారు రోడ్డు పరిస్థితులను స్వయంగా గుర్తించి, అడ్డంకులను తప్పించుకుంటూ, సురక్షితంగా ప్రయాణించగలదు. కృత్రిమ మేధస్సుతో పాటు సెన్సార్‌లు, లిడార్‌ టెక్నాలజీ, కెమెరాలు, GPS వ్యవస్థ లతో ఈ వాహనం పనిచేస్తుంది.

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం విజేత ఎవరు? ఎవరిప్లాన్‌ వర్కౌట్‌ అవుతుంది?

ఈ ప్రాజెక్టులో ఐఐఎస్‌సీ పరిశోధకులు ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ ఆల్గారిథమ్‌లను అభివృద్ధి చేశారు. విప్రో కంపెనీ సాఫ్ట్‌వేర్‌ ఇంటిగ్రేషన్‌, డేటా ప్రాసెసింగ్‌ భాగంలో కీలకపాత్ర పోషించింది. ఆర్వీ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు డిజైన్‌, మెకానికల్‌ మోడలింగ్‌, టెస్టింగ్‌ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

భవిష్యత్తులో ఈ సాంకేతికతను స్మార్ట్‌ సిటీలలో, రవాణా రంగంలో, భద్రతా వాహనాలుగా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. డ్రైవర్‌లెస్‌ టెక్నాలజీ వలన రోడ్డు ప్రమాదాలు తగ్గడమే కాకుండా, ఇంధన వినియోగం కూడా తగ్గుతుందని, ట్రాఫిక్‌ నియంత్రణకు ఇది పెద్ద సాయం అవుతుందని పరిశోధకులు తెలిపారు.

భారతదేశం ఇప్పటి వరకు విదేశీ టెక్నాలజీలపై ఆధారపడుతూ ఉండగా, ఇప్పుడు స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఈ డ్రైవర్‌లెస్‌ కార్‌ ఆవిష్కరణతో ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ స్మార్ట్‌ మొబిలిటీ విప్లవానికి నాంది పలికింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *