తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం భక్తులు ఉచిత దర్శనం కోసం 19 కంపార్డ్మెంట్లలో వేచి ఉన్నారు. ఇక సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లో ఉన్నారు. కాగా, రూ. 300 టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతున్నది. ఇక సర్వదర్శనం కోసం టోకెన్ పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతున్నది. ఆదివారం రోజున స్వామివారిని 81,348 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 26, 150 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఆదివారం హుండీ ద్వారా రూ. 4 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఏకాదశి రద్దీ దృష్ట్యా భక్తులు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే అధికారులను సంప్రదించాలని టీటీడీ తెలియజేస్తున్నది.
Related Posts
పుదుచ్చేరిలో విజయ్ హామీలు – వారందరికీ 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ
పుదుచ్చేరిలో ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతున్న వేళ, కొత్త రాజకీయ సమీకరణాలు, హామీలు, విమర్శలు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ తన పార్టీ తమిళగ…
పుదుచ్చేరిలో ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతున్న వేళ, కొత్త రాజకీయ సమీకరణాలు, హామీలు, విమర్శలు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ తన పార్టీ తమిళగ…
మూసీ ప్రక్షాళనలో ఎవ్వరినీ నిరాశ్రయులను చేయం – మెరుగైన పునరావాసం కల్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి హామీ
మూసీ ప్రక్షాళన కోసం చేపట్టే ప్రాజెక్టులో పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవరినీ నిరాశ్రయులను చేయమని, ఏ ఒక్కరికీ నష్టం జరక్కుండా వారందరికీ మరింత మెరుగైన వసతులతో ప్రభుత్వం…
మూసీ ప్రక్షాళన కోసం చేపట్టే ప్రాజెక్టులో పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవరినీ నిరాశ్రయులను చేయమని, ఏ ఒక్కరికీ నష్టం జరక్కుండా వారందరికీ మరింత మెరుగైన వసతులతో ప్రభుత్వం…