Native Async

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

Heavy Devotee Rush Continues at Tirumala on Ekadashi – Darshan Wait Time Up to 12 Hours
Spread the love

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం భక్తులు ఉచిత దర్శనం కోసం 19 కంపార్డ్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఇక సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లో ఉన్నారు. కాగా, రూ. 300 టికెట్‌ కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతున్నది. ఇక సర్వదర్శనం కోసం టోకెన్‌ పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతున్నది. ఆదివారం రోజున స్వామివారిని 81,348 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 26, 150 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఆదివారం హుండీ ద్వారా రూ. 4 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఏకాదశి రద్దీ దృష్ట్యా భక్తులు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే అధికారులను సంప్రదించాలని టీటీడీ తెలియజేస్తున్నది.

రాశిఫలాలు – డిసెంబర్‌ 15, 2025 సోమవారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit