తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం భక్తులు ఉచిత దర్శనం కోసం 19 కంపార్డ్మెంట్లలో వేచి ఉన్నారు. ఇక సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లో ఉన్నారు. కాగా, రూ. 300 టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతున్నది. ఇక సర్వదర్శనం కోసం టోకెన్ పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతున్నది. ఆదివారం రోజున స్వామివారిని 81,348 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 26, 150 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఆదివారం హుండీ ద్వారా రూ. 4 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఏకాదశి రద్దీ దృష్ట్యా భక్తులు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే అధికారులను సంప్రదించాలని టీటీడీ తెలియజేస్తున్నది.
Related Posts
లక్ష్మీనరసింహ స్వామి అవతారంలో దాగున్న రహస్యం
Spread the loveSpread the loveTweetహిందూ ధర్మంలో నరసింహ స్వామి అవతారం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రకటన. ఇది కేవలం రాక్షస సంహారమే కాకుండా, అహంకారాన్ని వంచన చేయని దివ్య…
Spread the love
Spread the loveTweetహిందూ ధర్మంలో నరసింహ స్వామి అవతారం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రకటన. ఇది కేవలం రాక్షస సంహారమే కాకుండా, అహంకారాన్ని వంచన చేయని దివ్య…
శ్రావణంలో శీతలాదేవి పూజను ఎందుకు చేస్తారు?
Spread the loveSpread the loveTweetశీతలా దేవి కథను విస్తృతంగా వివరించడానికి, హిందూ పురాణాలు, జానపద కథల ఆధారంగా ఆమె జన్మ, ఆమె శక్తి, , భక్తులకు ఆమె అందించే…
Spread the love
Spread the loveTweetశీతలా దేవి కథను విస్తృతంగా వివరించడానికి, హిందూ పురాణాలు, జానపద కథల ఆధారంగా ఆమె జన్మ, ఆమె శక్తి, , భక్తులకు ఆమె అందించే…
అమావాస్య రోజున ఈ పనులు అస్సలు చేయకూడదు
Spread the loveSpread the loveTweetఅమావాస్య అనగానే చాలామందికి భయం, అపశకునం, అసౌభాగ్యం అనే భావనలు తలదన్నుతాయి. అయితే ధర్మశాస్త్రాల ప్రకారం అమావాస్య రోజు విశిష్టమైనదే అయినప్పటికీ, కొన్ని నియమాలు…
Spread the love
Spread the loveTweetఅమావాస్య అనగానే చాలామందికి భయం, అపశకునం, అసౌభాగ్యం అనే భావనలు తలదన్నుతాయి. అయితే ధర్మశాస్త్రాల ప్రకారం అమావాస్య రోజు విశిష్టమైనదే అయినప్పటికీ, కొన్ని నియమాలు…