పూరీ జగన్నాథుడి రథయాత్ర కొనసాగుతోంది. పూరీ రథయాత్ర అంటే లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఉత్సవం. ఈ ఉత్సవంలో ఏదైనా సమస్య వస్తే అక్కడి నుంచి బయటపడటం ఎంత కష్టమో చెప్పక్కర్లేదు. రథోత్సవం జరిగే ప్రాంతంలో అత్యవసరం కోసం వైద్యసదుపాయాలు అందుబాటులో ఉంటాయి. రథయాత్ర జరుగుతుండగా అంబులెన్స్లో అత్యవసరంగా రోగిని తరలించాల్సి వచ్చింది. ఆ సమయంలో అంబులెన్స్ దారి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. కానీ, బీజేపీ యువమోర్చాకు చెందిన సుమారు 1500 మంది కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి లక్షలాదిమంది క్రౌడ్ను కంట్రోల్ చేస్తూ అంబులెన్స్కు దారిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పూరీ జగన్నాథ్ రథయాత్రను నిర్వహించే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా దానిపై పలు విమర్శలు వస్తాయి. పైగా హిందూత్వకార్డుతో ఒడిశాలో అధికారంలోకి వచ్చిన బీజేపీనే పూరీ జగన్నాథ్ రతయాత్రను విజయవంతంగా నిర్వహించలేకుంటే అంతకన్నా అవమానం మరొకటి ఉండదు. అందుకే ప్రభుత్వం ముందునుంచే కీలక నిర్ణయాలు తీసుకుంటూ విజయవంతంగా యాత్రను నిర్వహిస్తూ వస్తున్నది.
Related Posts
పవన్ కళ్యాణ్ విశ్లేషణః భారతదేశానికి మోదీజీ ఎందుకు కావాలి
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు వినగానే ప్రతి భారతీయుడి హృదయంలో గర్వభావం కలుగుతుంది. ఒక చిన్న పట్టణంలో సాధారణ కుటుంబంలో పుట్టి, చిన్నతనంలోనే జీవన పోరాటాలు…
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు వినగానే ప్రతి భారతీయుడి హృదయంలో గర్వభావం కలుగుతుంది. ఒక చిన్న పట్టణంలో సాధారణ కుటుంబంలో పుట్టి, చిన్నతనంలోనే జీవన పోరాటాలు…
బాడ్ బాయ్ కార్తీక్ టీజర్
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకున్న తరవాత మళ్లి ఒక మంచి సినిమా తో పెద్ద తెర ని పలకరించబోతున్నాడు.…
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకున్న తరవాత మళ్లి ఒక మంచి సినిమా తో పెద్ద తెర ని పలకరించబోతున్నాడు.…
ఓజీకి AP ప్రభుత్వం స్పెషల్ టికెట్ రేట్ల అనుమతి
AP లో పెద్ద సినిమాల విడుదలల సమయంలో ప్రొడ్యూసర్స్కు సహకారం అందించడానికి ప్రభుత్వం అప్పుడప్పుడు టికెట్ ధరలు పెంచడానికి అనుమతి ఇస్తుంటుంది. ఇదే విధంగా, పవర్స్టార్ పవన్…
AP లో పెద్ద సినిమాల విడుదలల సమయంలో ప్రొడ్యూసర్స్కు సహకారం అందించడానికి ప్రభుత్వం అప్పుడప్పుడు టికెట్ ధరలు పెంచడానికి అనుమతి ఇస్తుంటుంది. ఇదే విధంగా, పవర్స్టార్ పవన్…