పూరీ జగన్నాథుడి రథయాత్ర కొనసాగుతోంది. పూరీ రథయాత్ర అంటే లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఉత్సవం. ఈ ఉత్సవంలో ఏదైనా సమస్య వస్తే అక్కడి నుంచి బయటపడటం ఎంత కష్టమో చెప్పక్కర్లేదు. రథోత్సవం జరిగే ప్రాంతంలో అత్యవసరం కోసం వైద్యసదుపాయాలు అందుబాటులో ఉంటాయి. రథయాత్ర జరుగుతుండగా అంబులెన్స్లో అత్యవసరంగా రోగిని తరలించాల్సి వచ్చింది. ఆ సమయంలో అంబులెన్స్ దారి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. కానీ, బీజేపీ యువమోర్చాకు చెందిన సుమారు 1500 మంది కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి లక్షలాదిమంది క్రౌడ్ను కంట్రోల్ చేస్తూ అంబులెన్స్కు దారిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పూరీ జగన్నాథ్ రథయాత్రను నిర్వహించే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా దానిపై పలు విమర్శలు వస్తాయి. పైగా హిందూత్వకార్డుతో ఒడిశాలో అధికారంలోకి వచ్చిన బీజేపీనే పూరీ జగన్నాథ్ రతయాత్రను విజయవంతంగా నిర్వహించలేకుంటే అంతకన్నా అవమానం మరొకటి ఉండదు. అందుకే ప్రభుత్వం ముందునుంచే కీలక నిర్ణయాలు తీసుకుంటూ విజయవంతంగా యాత్రను నిర్వహిస్తూ వస్తున్నది.
Related Posts
ఆస్ట్రాయిడ్స్ను తవ్వేద్దాం…ఆకాశంలోకి ఎగిరేద్దాం
అంతరిక్షంలో గనుల తవ్వకం అనేది ఇప్పటివరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన కల్పిత ఆలోచనగా భావించేవారు. కానీ తాజా శాస్త్రీయ పరిశోధనలు చూస్తే, ఇది సమీప…
అంతరిక్షంలో గనుల తవ్వకం అనేది ఇప్పటివరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన కల్పిత ఆలోచనగా భావించేవారు. కానీ తాజా శాస్త్రీయ పరిశోధనలు చూస్తే, ఇది సమీప…
గురువారం దత్తాత్రేయుడి ఆరాధన రహస్యం
గురువారం హిందూ సంప్రదాయంలో గురు గ్రహం (బృహస్పతి)కి మరియు శ్రీ దత్తాత్రేయ స్వామికి అంకితం చేయబడిన పవిత్ర రోజు. శ్రీ దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, శివ త్రిమూర్తుల…
గురువారం హిందూ సంప్రదాయంలో గురు గ్రహం (బృహస్పతి)కి మరియు శ్రీ దత్తాత్రేయ స్వామికి అంకితం చేయబడిన పవిత్ర రోజు. శ్రీ దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, శివ త్రిమూర్తుల…
సింహవాహనంపై గోవిందుడు ఊరెరిగింపు
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడోరోజు స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి…
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడోరోజు స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి…