ఉత్తరాంధ్ర కల్పవల్లి,విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రె ఎన్.ఆర్.ఐ,సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస అన్నారు. పైడితల్లి అమ్మవారి పండగ తేదీలు ప్రకటించిన మేరకు మంత్రి కొండపల్లి విజయనగరం మూడు లాంతర్ల వద్ద ఉన్న చదురుగుడిలో కొలువతీరే అమ్మవారిని మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ముఖ ద్వారం వద్ద విలేకరులతో మంత్రి కొండపల్లి మాట్లాడుతూ అక్టోబర్ లో పండగ అయిన వెంటనే ఆలయ విస్తరణ పనులు ప్రారంభం అవుతాయన్నారు.ఇప్పటికే ఆలయ విస్తరణ పనులకు టెండర్లను పలిచామన్నారు. ఇక ఉత్తరాంద్ర కల్పవల్లి శ్రీ శ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి పండగను ఇప్పటికే రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఉత్తరాంద్రకే కాకుండా యావత్ తెలుగు రాష్ట్రాలనుంచీ అలాగే పొరుగు రాష్ట్రం ఓడిషా నుంచీ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తండోప తండాలు గా వస్తారన్నారు. పండగకు దేవాదాయ శాఖ కు ఇప్పటికే నిధులు మంజూరు చేయడం జరిగిందని మంత్రి కొండపల్లి స్పష్టం చేసారు.
Related Posts
దేశ ఆర్థిక రంగానికి ఊతం…సామాన్యులకు ఊరట
2025 సెప్టెంబర్ 3న దేశ రాజకీయ–ఆర్థిక రంగంలో ఒక కీలక మలుపు తిరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ చరిత్రాత్మక…
2025 సెప్టెంబర్ 3న దేశ రాజకీయ–ఆర్థిక రంగంలో ఒక కీలక మలుపు తిరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ చరిత్రాత్మక…
అమెరికాలో గంటగంటకు పెరుగుతున్న ఓజీ మానియా
ఓ పెద్ద టిప్పర్ లారీ వచ్చి కారును గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? సునామీ సముద్రంలో కాదు…భూమిపై వస్తే ఎలా ఉంటుందో తెలుసా అంటున్నా పవర్ స్టార్…
ఓ పెద్ద టిప్పర్ లారీ వచ్చి కారును గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? సునామీ సముద్రంలో కాదు…భూమిపై వస్తే ఎలా ఉంటుందో తెలుసా అంటున్నా పవర్ స్టార్…
Gold Prices Rebound After Two-Day Decline
Hyderabad: After witnessing a sharp decline over the past two days, gold prices bounced back slightly on Wednesday, giving a…
Hyderabad: After witnessing a sharp decline over the past two days, gold prices bounced back slightly on Wednesday, giving a…