గత ఎన్నికల సమయంలో కుప్పానికి నీరు అందిస్తామని గతంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన ఈ హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నాడని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కుప్పానికి నీళ్లు రాకుండా చాలా మంది అడ్డుకున్నారని, ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుపడినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే నీటిని తీసుకురావడాన్ని అడ్డుకోలేకపోయారని అన్నారు. కుప్పంలోని పరమ సముద్రానికి నీటిని మళ్లించిన తీరును ఓ యూట్యూబర్ తన ఛానల్లో పెట్టగా, దానిని నారా లోకేష్ షేర్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని మళ్లించి రాయలసీమలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. ఇందులో భాగంగానే కుప్పానికి కూడా నీటిని తరలించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.
Related Posts
విజయనగరంలో ఘనంగా గురజాడ జయంతి వేడుకలు
Post Views: 36
Post Views: 36
బెల్లంకొండ శ్రీనివాస్ హైందవ బర్త్డే పోస్టర్…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, లుధీర్ బయరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హైందవ’ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ టీజర్నే ప్రేక్షకుల్లో భారీ…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, లుధీర్ బయరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హైందవ’ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ టీజర్నే ప్రేక్షకుల్లో భారీ…