ఏం వెలగబెట్టారు… అంతా మా హాయాంలోనే జరిగింది

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటు లో పనులకు చెందిన అన్ని పనులు తమ ప్రభుత్వ హాయాంలోనే జరిగాయని అన్నారు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి ఇంచార్జ్ ఎం. శ్రీనివాస్ స్పష్టం చేశారు. తన క్యాంప్ ఆఫీస్ లో గురువారం ఆయన మాట్లాడుతూ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయడు ఏం సాధించారని ప్రశ్నించారు. విమానాశ్రయానికి సంబందించి స్థల సేకరణ, పెట్టుబడులు, నిర్వాసితులకు నష్టపరిహారం ఇలా అన్ని పనులు గత జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు కేవలం హంగు ఆర్భాటం కోసం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి గొప్పలకే పరిమితం అవ్వడం దౌర్భాగ్యమన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *