Native Async

మార్గశిర పౌర్ణమి విశిష్టత… ఇలా చేస్తే సంపద, మానసిక ప్రశాంతత వృద్ధి

Margashira Pournami 2024 Significance, Puja Benefits and Auspicious Thursday Rituals
Spread the love

మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈసారి పౌర్ణమి గురువారం రోజున రావడం మరింత విశిష్టతను కలిగిస్తోంది. మార్గశిర మాసం స్వయంగా లక్ష్మీదేవికి ప్రీతికరమైనది; అదే సమయంలో గురువారము బృహస్పతిదేవునికి సంబంధించిన శుభదినం. ఈ రెండూ కలిసివచ్చే పౌర్ణమి అత్యంత మంగళకరంగా పండితులు చెప్తున్నారు.

ఈ పర్వదినంలో లక్ష్మీపూజ, శ్రీసూక్త పఠనం, దీపారాధన చేయటం ద్వారా ఐశ్వర్యం, ధనసమృద్ధి కలుగుతుందని విశ్వాసం. అదేవిధంగా ప్రదోషకాలం కూడా ఈ రోజున సమీపంగా వస్తుంది కాబట్టి ఆ సమయంలో శివపూజ అత్యద్భుత ఫలితాలను అందిస్తుంది. శివుడికి అభిషేకం చేయటం, బిల్వపత్రార్పణ చేయటం, మహాన్యాసం చదవటం వలన పాపక్షయము, శాంతి, సౌభాగ్యం ప్రసాదిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ రోజు చంద్రుడిని ఆరాధించడం కూడా అత్యంత శ్రేష్ఠం. చంద్రశేఖరుడైన శివుడిని పూజించడం, చంద్రునికి ఆర్ఘ్యం ఇవ్వడం వలన చంద్రదోషాలు తగ్గిపోతాయి. మానసిక ప్రశాంతత, మనోస్థిరత పెరుగుతాయి. కుటుంబంలో శాంతి, సమృద్ధి నెలకొంటాయి.

పండితుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రత్యేకమైన గురువార పౌర్ణమి నాడు లక్ష్మీవార వ్రతం, శివపూజ, చంద్రారాధన చేస్తే సంవత్సరమంతా అష్టలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. అన్ని శుభకార్యాలు సులభంగా సిధ్ధిస్తాయి. ఈ రోజు భక్తులు ఉపవాసం, దీపార్చన, ధానధర్మాలు చేస్తే మరింత పుణ్యఫలం లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit