పురాణాల ప్రకారం, మాఘ శుద్ధ సప్తమి అశ్విని నక్షత్రం ఆదివారం రోజున సూర్య భగవానుడు అదితి, కశ్యప ప్రజాపతులకు జన్మించాడు. అంటే ఇది సూర్య జయంతి. ఈ రోజునే సూర్యుడు తన సప్త అశ్వములు (ఏడు గుర్రాలు) పూన్చిన బంగారు రథంపై తొలిసారిగా సంవత్సర కాల గతి నక్షత్రాత్మక రాసి చక్రంలో తన ప్రయాణం ప్రారంభమైంది. అందుకే దీనిని ‘రథసప్తమి’ అంటారు. సూర్యుడు మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు. అయితే, రథసప్తమి నాటికి సూర్యుని గతి పూర్తిగా ఉత్తరం వైపుకు తిరిగి, వేగాన్ని పొంచుకోవటానికి సప్తాశ్వాలు సిద్ధమయ్యే సమయం ఇది. సూర్య రథం దక్షిణం నుండి ఉత్తరానికి తిరగడం అంటే, భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో సూర్యకిరణాలు భూమిపై పడే కోణం మారడం. ఈ రోజు నుండి పగటి కాలం క్రమంగా పెరుగుతుంది. దీనివల్ల వాతావరణంలో వెచ్చదనం పెరిగి, చలి తగ్గుతుంది. రథసప్తమి అనగా కాలగమనానికి ప్రతీక.
Related Posts
అయ్యప్ప మకరజ్యోతి మూడుసార్లు ఎందుకు కనిపిస్తుందో తెలుసా?
శబరిమల కొండపై మకర సంక్రాంతి రోజున దర్శనమిచ్చే అయ్యప్ప స్వామి మకరజ్యోతి భక్తులకు దివ్యానుభూతిని కలిగిస్తుంది. ఆ పవిత్ర క్షణం కోసం లక్షలాది మంది భక్తులు గంటల…
శబరిమల కొండపై మకర సంక్రాంతి రోజున దర్శనమిచ్చే అయ్యప్ప స్వామి మకరజ్యోతి భక్తులకు దివ్యానుభూతిని కలిగిస్తుంది. ఆ పవిత్ర క్షణం కోసం లక్షలాది మంది భక్తులు గంటల…
సంక్రాంతి రోజున రథం ముగ్గు ఎందుకు వేస్తారు…గీతల్లో దాగిన రహస్యం ఇదే
సంక్రాంతి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పవిత్ర ఘడియ, అదే ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ సమయంలో గృహాల ముందు భక్తిశ్రద్ధలతో…
సంక్రాంతి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పవిత్ర ఘడియ, అదే ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ సమయంలో గృహాల ముందు భక్తిశ్రద్ధలతో…
మకరజ్యోతి దర్శనంః భక్తులతో కిక్కిరిసిపోతున్న శబరిగిరులు
ఈ రోజుల్లో శబరిగిరులు ఆధ్యాత్మిక కాంతులతో నిండిపోయాయి. అయ్యప్ప స్వామి నామస్మరణతో అడవులన్నీ మారుమోగుతున్నాయి. మకర సంక్రాంతి సమీపిస్తున్న వేళ శబరిమల ఆలయం భక్తుల శరణుఘోషతో మరింత…
ఈ రోజుల్లో శబరిగిరులు ఆధ్యాత్మిక కాంతులతో నిండిపోయాయి. అయ్యప్ప స్వామి నామస్మరణతో అడవులన్నీ మారుమోగుతున్నాయి. మకర సంక్రాంతి సమీపిస్తున్న వేళ శబరిమల ఆలయం భక్తుల శరణుఘోషతో మరింత…