పురాణాల ప్రకారం, మాఘ శుద్ధ సప్తమి అశ్విని నక్షత్రం ఆదివారం రోజున సూర్య భగవానుడు అదితి, కశ్యప ప్రజాపతులకు జన్మించాడు. అంటే ఇది సూర్య జయంతి. ఈ రోజునే సూర్యుడు తన సప్త అశ్వములు (ఏడు గుర్రాలు) పూన్చిన బంగారు రథంపై తొలిసారిగా సంవత్సర కాల గతి నక్షత్రాత్మక రాసి చక్రంలో తన ప్రయాణం ప్రారంభమైంది. అందుకే దీనిని ‘రథసప్తమి’ అంటారు. సూర్యుడు మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు. అయితే, రథసప్తమి నాటికి సూర్యుని గతి పూర్తిగా ఉత్తరం వైపుకు తిరిగి, వేగాన్ని పొంచుకోవటానికి సప్తాశ్వాలు సిద్ధమయ్యే సమయం ఇది. సూర్య రథం దక్షిణం నుండి ఉత్తరానికి తిరగడం అంటే, భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో సూర్యకిరణాలు భూమిపై పడే కోణం మారడం. ఈ రోజు నుండి పగటి కాలం క్రమంగా పెరుగుతుంది. దీనివల్ల వాతావరణంలో వెచ్చదనం పెరిగి, చలి తగ్గుతుంది. రథసప్తమి అనగా కాలగమనానికి ప్రతీక.
Related Posts
వెండి గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారో తెలుసా?
వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ కాలంలో తెలుగు ప్రజల మనసు సహజంగానే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం వైపు మళ్లుతోంది. కాలాన్ని ముందే దర్శించిన…
వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ కాలంలో తెలుగు ప్రజల మనసు సహజంగానే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం వైపు మళ్లుతోంది. కాలాన్ని ముందే దర్శించిన…
యోగిని ఏకాదశి విశిష్టత ఏమిటి? ఆ రోజున ఏం చేయాలి?
సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అందులోనూ ఆషాఢ మాస కృష్ణ పక్షంలో వచ్చే ‘యోగిని ఏకాదశి’ మానవాళికి లభించిన ఒక…
సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అందులోనూ ఆషాఢ మాస కృష్ణ పక్షంలో వచ్చే ‘యోగిని ఏకాదశి’ మానవాళికి లభించిన ఒక…
అప్పన్న చందనోత్సవం…దర్శించినవారి జన్మధన్యం
వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) నాడు సింహాచలం క్షేత్రంలో జరిగే చందనోత్సవం భక్తుల పాలిట కల్పవృక్షం. ఏడాది పొడవునా చందన లేపనంతో కప్పబడి ఉండే స్వామివారు,…
వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) నాడు సింహాచలం క్షేత్రంలో జరిగే చందనోత్సవం భక్తుల పాలిట కల్పవృక్షం. ఏడాది పొడవునా చందన లేపనంతో కప్పబడి ఉండే స్వామివారు,…