ప్రభుత్వ శాఖలు ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలే కొనాలి… సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy Orders Government Departments To Purchase Only Electric Vehicles

ప్రభుత్వ శాఖలు ఇకనుంచి తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలను (#EV) మాత్రమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. కాలుష్య రహిత రవాణా వ్యవస్థ లక్ష్యంగా పని చేయాలని చెప్పారు.

కోర్ అర్బన్ ఏరియా పరిధిలోని ప్ర‌భుత్వ శాఖ‌లు అద్దెకు తీసుకునే వాహ‌నాలు సైతం ఈవీలే ఉండాల‌ని తెలిపారు. ర‌వాణా శాఖ‌లోని మాన్యువ‌ల్ విధానాలకు స్వ‌స్తి చెప్పాల‌ని, మొత్తం ఆన్‌లైన్‌లోనే కార్య‌క‌లాపాలు కొన‌సాగించాల‌ని ఆదేశించారు.

✅ముఖ్యమంత్రి గారు రవాణా శాఖ అంశాలపై మంత్రి పొన్నం గారు ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆర్‌టీవో కార్యాల‌యాలు అద్దె భ‌వ‌నాల్లో కొన‌సాగడానికి వీల్లేద‌ని, వెంట‌నే సొంత‌ భ‌వ‌నాల నిర్మాణాలకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.

✅రోడ్డు ప్ర‌మాదాల‌పై అవ‌గాహ‌న పెంచాల‌ని, ప్రజల్లో చైతన్యం తేవడానికి షార్ట్ ఫిల్మ్‌లు ప్ర‌ద‌ర్శించాల‌ని సూచించారు. శంషాబాద్ స‌మీపంలో హైస్పీడ్ రైలు కారిడార్ ప్రారంభ‌మ‌య్యే ప్రాంతంలో అధునాత‌న బస్ టెర్మినల్‌కు స్థ‌లం కేటాయిస్తామ‌ని, అందుకు త‌గిన ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని సీఎం ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *