కార్తీక మాసం వేళ… పరమేశ్వరుని మెడలో ఉండే నాగుపాము విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం దర్శనమిచ్చింది. పవిత్ర కార్తీక మాసం శుభ సందర్భాన కరుడుగట్టిన, కాఠిన్య మనసు ఉన్న ఖాకీల కంట పడింది. అయితే ఆ కాఠిన్యపు హృదయంతో చూడని విజయనగరం టూటౌన్ పోలీసులు విషపు జాతుల పట్ల కారణ్యమైన ప్రేమ చూపించి శహభాష్ అనిపించుకున్నారు. టూటౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ కనకరాజుల ఆధ్వర్యంలో వారిచ్చిన ఆదేశాలతోకానిస్టేబుల్ రమేష్ చాకచక్యంగా స్టేషన్ ఆవరణలో కనిపించిన ఆ పాముకు నమస్కరించి… ఎలాంటి భయం, బెదురు లేకుండా చేత్తోనే ఆ విషపు సర్పాన్ని పట్టుకొని స్టేషన్ పక్కనే పొదల్లో పడేశారు. ఏదైనా కార్తీక మాసం పూట పోలీస్ స్టేషన్ లో ఖాకీల కంట పడిన ఆ పాము ను ఇదే ఖాకీలు కొట్టకుండా, చంపకుండా కనికరం జాలి, దయ, గుణాలు చూపించారంటే అతిశయోక్తే.
Related Posts
రుచికరమైన కేరళ మలబార్ బిర్యానీ రెసిపీ
🍗 మలబార్ చికెన్ బిర్యానీ తయారీ విధానం 🍚 🛒 కావలసిన పదార్థాలు: 👉 చికెన్ మారినేషన్కి: 👉 బిర్యానీ కోసం: 👨🍳 తయారీ విధానం: ✅…
🍗 మలబార్ చికెన్ బిర్యానీ తయారీ విధానం 🍚 🛒 కావలసిన పదార్థాలు: 👉 చికెన్ మారినేషన్కి: 👉 బిర్యానీ కోసం: 👨🍳 తయారీ విధానం: ✅…
హృదయాన్ని కదిలించ దృశ్యం… తల్లిప్రేమ కోసం
ఇటీవల ఉత్తరభారతదేశంలో సంభవించిన వరదల కారణంగా మనుషులు మాత్రమే ఇబ్బందులు పడలేదు… అడవిలోని చాలా జంతువులు అనేక సమస్యలు ఎదుర్కొన్నాయి. వరద ముప్పుకు గురైన వారిని ప్రభుత్వాలు…
ఇటీవల ఉత్తరభారతదేశంలో సంభవించిన వరదల కారణంగా మనుషులు మాత్రమే ఇబ్బందులు పడలేదు… అడవిలోని చాలా జంతువులు అనేక సమస్యలు ఎదుర్కొన్నాయి. వరద ముప్పుకు గురైన వారిని ప్రభుత్వాలు…
Poll: మోదీ పాలనపై మీ అభిప్రాయం
Post Views: 20
Post Views: 20