వ్యక్తి,కుటుంబం,సమాజం ఈ మూడింటి సమైక్యతే దేశం అని అనాధి గా వస్తూ ఉంది.దాదాపు 800 ఏళ్ల క్రితం నాడు అఖండ భారతావనిగా ఫరిడవిల్లిన దేశాన్ని విదేశీ శక్తులు ఆక్రమించుకుని అఖండ భారతావనని ఖండ ఖండాలు చేసింది.ఆ బానిసత్వ పొకడలతో దాదాపు 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ సర్కార్ ను దేశ పౌరులంతా ఒక్కటై,సమైక్యంగా ఫ్రెంచ్ ఆస్ట్రోలజిస్ట్ నాస్ట్రోడమస్ పేర్కొన్న విదంగానే అఖండ భారతావని కళ్లముందు సాక్షాత్కరిస్తున్నసమయం ఇది.కుటుంబ విలువలే దేశాభివృద్దికి పునాదులంటూ 1925 లోనే నాటి సమాజంలో బీజాన్ని నాటిన డాక్టర్ కేశవరావ్ బలిరాం హేడ్గేవార్ కల వందేళ్ల తర్వాత సాక్షాత్కరమవుతోంది.
ఈ క్రమంలోనే ప్రతీ భారతీయు మదిలోనూ,అలాగే ప్రతీ ఇంటిలోనూ భరత మాతను పూజించుకుందామన్న సంఘ్ ఆశయానికి ఆ కుటంబం నడుంబిగించింది. జన్మనిచ్చింది కన్నతల్లి అయితే సమాజంలో ఇసుమంత చోటు ఇచ్చింది భరత మాత. ఆ లక్ష్యంతోనే ఏపీలోని ఉత్తరాంద్ర లో విజయనగరం తోటపాలెం బాలాజీ నగర్ లో ప్రముఖ వీడియో గ్రాఫర్ దేశరాజు అప్పలనరసయ్య కుటుంబం యావత్తు ఇంటిలోనే భరత మాత కు పూజలు చేసారు. కుటుంబంలో ఉన్న ఆయన భార్య సుమతో పాటు ఇంజనీర్ చదువుతున్న ఇద్దరు పిల్లలతో ఇంట్లోనే కుర్చీలో భరత మాత ఫోటో పెట్టి..ధూప,దీపలు వెలిగించి చేతులు జోడించి కుటుంబం యావత్త్ నమస్సులతో ప్రణమిల్లారు.భరత మాత బిడ్డలం..భగత్సింగ్ వారుసులం అంటూ నినదించారు.అందుకే అంటారు ఇంటికి దీపం ఇల్లాలని.