గద్దెనెక్కి రెండేళ్లకు చేరువ… జ్వరాలొస్తే మాకేం సంబంధం అంటారా….?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా సమస్యల పట్ల, ప్రజల పట్ల పట్టించుకునే నాధుడే కరువయ్యారని విజయనగరం జేడ్పీ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి నియోజక వర్గ సమన్వయ కర్త మజ్జి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం ప్రదీప్ నగర్ లో గురువారం మీడియా తో జేడ్పీ చైర్మన్ మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఇలాకలో జ్వరాలు వస్తే మమ్మల్నేమి చేయమంటారన్న మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు. ఇదేనా కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన, ఇదేనా అటు చంద్రబాబు, ఇటు పవన్ బాబుల ప్రభుత్వ పాలన అని ఎద్దేవా చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *