తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం భక్తులు ఉచిత దర్శనం కోసం 19 కంపార్డ్మెంట్లలో వేచి ఉన్నారు. ఇక సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లో ఉన్నారు. కాగా, రూ. 300 టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతున్నది. ఇక సర్వదర్శనం కోసం టోకెన్ పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతున్నది. ఆదివారం రోజున స్వామివారిని 81,348 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 26, 150 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఆదివారం హుండీ ద్వారా రూ. 4 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఏకాదశి రద్దీ దృష్ట్యా భక్తులు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే అధికారులను సంప్రదించాలని టీటీడీ తెలియజేస్తున్నది.
Related Posts
అవసరం కోసం మోసం చేయాలని చూస్తే… ఈ నీతికథ చదవండి
మనం ఎప్పుడు మరణిస్తాం అంటే చెప్పడం కష్టం. మనకు నచ్చనపుడు మరణించే అవకాశం ఉండదు. నచ్చినంత కాలం బతికే అవకాశం కూడా ఉండదు. కానీ భీష్ముడు అలా…
మనం ఎప్పుడు మరణిస్తాం అంటే చెప్పడం కష్టం. మనకు నచ్చనపుడు మరణించే అవకాశం ఉండదు. నచ్చినంత కాలం బతికే అవకాశం కూడా ఉండదు. కానీ భీష్ముడు అలా…
మెట్రోను ప్రభుత్వం డీల్ చేయగలుగుతుందా?
హైదరాబాద్ నగర ప్రజల రోజువారీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పబ్లిక్–ప్రైవేట్…
హైదరాబాద్ నగర ప్రజల రోజువారీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పబ్లిక్–ప్రైవేట్…