చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. ఈ వర్షం కారణంగా రోడ్లు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు అంటే అక్టోబర్ 23వ తేదీ జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాద్యాయులు, మండల విద్యాశాఖాధికారులకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. ఈశాన్య రుతుపవనాలు, బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా తమిళనాడు, రాయలసీమ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
Related Posts
శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్…ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి ఆమోదం
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సు సేవలు – టీటీడీ కీలక నిర్ణయం తిరుమల తిరుపతి – భక్తులకు మానవత్వానికి నిలువెత్తిన ఉదాహరణ హిందూ ధర్మంలో అత్యంత…
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సు సేవలు – టీటీడీ కీలక నిర్ణయం తిరుమల తిరుపతి – భక్తులకు మానవత్వానికి నిలువెత్తిన ఉదాహరణ హిందూ ధర్మంలో అత్యంత…
Breaking News: Charge Sheet Filed In Sandhya Stampede Case
Finally, after one year, the police have filed a charge sheet in the Sandhya Theatre stampede case. According to the…
Finally, after one year, the police have filed a charge sheet in the Sandhya Theatre stampede case. According to the…
ఏకాదశి ఉపవాసానికి ఎందుకు ప్రాధాన్యత ఉంటుంది
హిందూ ధర్మశాస్త్రాలలో ఏకాదశి ఉపవాసానికి అత్యున్నత స్థానం కలదు. ఇది కేవలం ఉపవాసం మాత్రమే కాదు, భక్తి, నియమం, ఆత్మశుద్ధికి మార్గంగా శాస్త్రాలు పేర్కొంటాయి. పురాణాల ప్రకారం…
హిందూ ధర్మశాస్త్రాలలో ఏకాదశి ఉపవాసానికి అత్యున్నత స్థానం కలదు. ఇది కేవలం ఉపవాసం మాత్రమే కాదు, భక్తి, నియమం, ఆత్మశుద్ధికి మార్గంగా శాస్త్రాలు పేర్కొంటాయి. పురాణాల ప్రకారం…