భారత్‌ నయా స్ట్రాటజీః ఉక్రెయిన్‌కు డీజిల్‌ సరఫరాలో అగ్రస్థానం

2025 జూలైలో భారతదేశం, ఉక్రెయిన్‌కు అగ్ర డీజిల్‌ సరఫరాదారుగా ఎదిగింది. మొత్తం దిగుమతుల్లో 15.5% వాటా సాధిస్తూ, రోజువారీగా సుమారు 2,700 టన్నుల సరఫరా చేసింది.

భారత రిఫైనరీలు తక్కువ ధరలకు దిగుమతి చేసుకున్న రష్యా క్రూడ్ ఆయిల్‌ను ప్రాసెస్ చేసి, దాన్యూబ్ నది మార్గం ద్వారా ఉక్రెయిన్‌కు సరఫరా చేయడం ఈ వ్యూహాత్మక ఎగుమతిలో భాగమైంది.

ప్రాంతీయ జియోపాలిటికల్ ఉద్రిక్తతల మధ్య, ఈ చర్య భారతదేశం చేపట్టిన ఎనర్జీ డిప్లొమసీని స్పష్టంగా చూపిస్తుంది. అయితే, అమెరికా సలహాదారు పీటర్ నావార్రో దీనిపై విమర్శలు చేస్తూ, భారత్ పరోక్షంగా రష్యా యుద్ధ ప్రయత్నాలకు ఇంధనం అందిస్తున్నదని ఆరోపించారు. కానీ భారత్ మాత్రం జాతీయ భద్రత, ఆర్థిక లాభాలను ముందుకు పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నదని పేర్కొంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *