ఖాజీపేట శ్వేతర్క మూల గణపతి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన దేవీ నవరాత్రులు

కాజీపేటలోని స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది భక్తులు ఆత్రుతగా ఎదురుచూసే ఈ ఉత్సవాలు ఆద్యంతం వైభవంగా సాగుతాయి. ఈసారి కూడా భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మికతలతో నిండిన వాతావరణంలో తొలిరోజు ఉత్సవాలు ప్రత్యేకంగా నిర్వహించారు.

మొదట దేవాలయంలో మండపస్థిత పూజలు నిర్వహించి, అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తీసుకువెళ్ళారు. అనంతరం గురు అనంతానంద గారి ఆశీర్వాదంతో బ్రహ్మశ్రీ అయినవోలు రాధాకృష్ణ శర్మ, సాయి కృష్ణ శర్మ దంపతులు తొలిపూజలు ఆరంభించారు. అమ్మవారికి పవిత్రమైన అభిషేకం చేసి, శైలపుత్రి అవతారంగా అద్భుతంగా అలంకరించారు. ఆ తర్వాత షోడశోపచార, చతుశ్షష్టి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.

పూజల అనంతరం హారతి, తీర్థప్రసాదం పంపిణీ జరిగింది. అన్నపూర్ణ భవనంలో అన్నదానం కార్యక్రమం భక్తులందరినీ ఆకట్టుకుంది. ఉత్సవాల నిర్వహణలో దేవాలయ కార్యకర్తలు సీనమ్మ, రాధా, విజయకోటి, భాగ్యలక్ష్మి, ఉమారాణి, రఘువీర్, అనంతకృష్ణ, ధృవంతి, కృష్ణ, పుష్పాన్విత, కైవల్య, శతాషి, హర్ష, స్వామి తదితరులు చురుకుగా పాల్గొన్నారు.

దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ అయినవోలు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఈ మహోత్సవాలు జరిగాయి. భక్తులంతా అమ్మవారి దివ్యదర్శనంతో ఆధ్యాత్మిక పరవశం పొందారు. తొలిరోజు శైలపుత్రి అవతార దర్శనం భక్తులకు విశేషమైన అనుభూతి కలిగించింది.

ఈ నవరాత్రుల్లో ప్రతి రోజూ దేవి ఒక కొత్త అవతారంలో దర్శనమిస్తారు. అందులో శైలపుత్రి అమ్మవారు ధర్మానికి, శక్తికి ప్రతీక. భక్తులు ఆమెను దర్శించడం ద్వారా కుటుంబంలో శాంతి, ఆయురారోగ్యాలు, సుఖసంపదలు ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి తొలిరోజు నుంచే కాజీపేట దేవాలయం భక్తులతో కిటకిటలాడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *