దేశానికి నాయకుడు అంటే కేవలం పార్టీ వ్యవహారాలు అధికారంలోకి వస్తే పాలన వ్యవహారాలు మాత్రమే చూసుకోవడం కాదు. దేశానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రమోట్ చేయాలి. ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి. ముఖ్యంగా క్రీడారంగంలో రాణిస్తున్న చాంపియన్స్ని ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని సన్మానించాలి. వారిలో ధైర్యం నింపాలి. వారికి అండగా ఉండాలి. నేనున్నాననే భరోసా ఇవ్వాలి. ప్రధాని మోదీ ఈ విషయంలో అందరికంటే ముందు ఉన్నాడు. దేశానికి చెందిన ఛాంపియన్లు ఎవరైనా సరే వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఇటీవల మహిళా వరల్డ్కప్లో విజయం సాధించిన విమెన్ టీమ్తో ఇంటరాక్ట్ అయ్యి వారిని ప్రోత్సహించాడు. తాజాగా అంథుల క్రికెట్ పోటీల్లో మహిళల టీమ్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ విమెన్ టీమ్తో ఇంటరాక్ట్ అయ్యి వారిలో మరింత ప్రోత్సాహం అందించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Related Posts
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG కి అనుకోని షాక్…
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న OG సినిమా తెలంగాణలో చిన్న బ్రేక్ తగిలింది. తెలంగాణ హైకోర్టు తాజాగా ప్రభుత్వం ఇచ్చిన టికెట్ ధరలు పెంచే…
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న OG సినిమా తెలంగాణలో చిన్న బ్రేక్ తగిలింది. తెలంగాణ హైకోర్టు తాజాగా ప్రభుత్వం ఇచ్చిన టికెట్ ధరలు పెంచే…
కంచి కామాక్షి ఆలయంలో ఢంకా వినాయకుని మహిమ
కాంచీపురంలోని కంచి కామాక్షి ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కేవలం దర్శన స్థలం మాత్రమే కాకుండా, భక్తుల…
కాంచీపురంలోని కంచి కామాక్షి ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కేవలం దర్శన స్థలం మాత్రమే కాకుండా, భక్తుల…
Mithra Mandali Pre-Release Press Meet Live
Post Views: 98
Post Views: 98