మరణాన్ని ఇలా ముందుగానే తెలుసుకోవచ్చు

పుట్టిన మనిషి మరణించక తప్పదు…మరణించిన మనిషి తిరిగి పుట్టక తప్పదు. మనచేతిలో లేని మరణం గురించే మనిషి ఆందోళన చెందుతుంటాడు. చిన్న చిన్న శకునాలు కనిపించినా భయపడి ఆనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటాడు. మన జీవితంలో జరగబోయే విషయాలను జ్యోతిష్యం ద్వారా తెలుసుకున్నట్టుగానే మరణాన్ని కూడా ముందుగా తెలుసుకునే వీలుందని స్వప్నశాస్త్రికులు చెబుతున్నారు. కలలో పసిబిడ్డలు ఏడుస్తున్నట్టుగా కనిపిస్తే జీవితంలో కొన్ని నిరాశలను ఎదర్కోవలసి వస్తుంది. అదే నడవడానికి ప్రయత్నిస్తున్న శిశువు కనిపిస్తే తెలియని బలాన్ని ఇస్తున్నట్టుగా భావిస్తారు. కలలో నల్లటి ముసుగు కలిగిన వ్యక్తులు తరచుగా కనిపిస్తున్నారంటే త్వరలోనే సదరు మనిషి మరణించబోతున్నాడని సంకేతంగా భావించాలని స్వప్న శాస్త్రం చెబుతున్నది. రక్తం కనిపించినా, కలలో నల్లని పాములు కనిపించినా మరణానికి సంకేతంగా భావించాలని పండితులు చెబుతున్నారు.

పుష్ప రాజ్ Vs శీలావతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *