ఇక్కడి వినాయకుడి తొండం పెరుగుతూనే ఉంటుంది

విశాఖపట్నం జిల్లా చోడవరం సమీపంలోని స్వయంభూ విఘ్నేశ్వర ఆలయం ప్రత్యేక ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. దేశంలో అనేక వినాయక ఆలయాలు ఉన్నప్పటికీ, ఇక్కడి గణపతి స్వామివారి మహిమ ఎంతో విశేషం. ఈ వినాయకుడు స్వయంభూవుగా వెలిసినదే కాక, గత 200 ఏళ్లుగా ప్రజల ఆరాధనను పొందుతూ అపూర్వ శక్తిని ప్రసాదిస్తున్నాడని భక్తులు విశ్వసిస్తున్నారు.

బాబోయ్‌ రెండు లక్షలు దాటేసిన వెండిధర

ఈ ఆలయానికి విశేష ఆధ్యాత్మికతను అందిస్తున్న అంశం స్వామివారి తొండం. ప్రతి ఏడాది స్వల్పంగా పెరుగుతూ వస్తుందని ఆలయ పురోహితులు చెబుతారు. గర్భగుడిలో స్వామివారు నడుము పైభాగం వరకు మాత్రమే భక్తులకు కనిపిస్తారు. మిగతా శరీరం భూమిలో కలిసిపోయినట్లుగా కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఆయన తొండం గర్భగుడి నుంచి నేరుగా బయట కోనేరు వరకు పొడవుగా వ్యాపించి ఉందని, ఆ కోనేరులోని పవిత్రజలాన్ని తొండం ద్వారా పీల్చి తిరిగి గర్భగుడిలోకి ప్రవాహం చేస్తారని స్థానికులు నమ్ముతారు.

ఈ కారణంగానే గర్భగుడిలో ఎప్పుడూ నీరు నిల్వగా కనిపిస్తుంది. ఈ నీరు సాధారణ నీరు కాక, స్వామివారి ప్రసాద జలమని భావించి అర్చనలు, అభిషేకాలు నిర్వహించేందుకు ఉపయోగిస్తారు. ఈ పవిత్ర నీటితో చేసే అభిషేకం గణపతిదేవుని ఆశీర్వాదాలను మరింతగా అందిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఆలయ పునాది నుంచి నేటి వరకు ఇక్కడ జరిగే అద్భుత అనుభవాలు భక్తుల భక్తిని మరింతగా పెంచుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *