తిరుమలలో భారీగా పెరిగిన రద్దీ

తిరుమలకు వెళ్లు భక్తులకు టీటీడీ కొన్ని సూచనలు చేసింది. తిరుమలలో రద్దీ అనూహ్యంగా పెరగడంతో చిన్నారులతో కలిసి వచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాగా ప్రస్తుతం భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతున్నది. ఇక 300 రూపాయల టికెట్‌ ఉన్న భక్తులకు సుమారు 3 నుంచి 5 గంటల సమయం పడుతున్నది. అంతేకాదు, సర్వదర్శనం కోసం ముందుగానే టోకెన్‌ పొందిన భక్తులకు నాలుగు నుంచి 6 గంటల సమయం పడుతున్నట్టు అధికారులు తెలియజేశారు. ఇకపోతే శనివారం రోజున స్వామివారిని 75,082 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 33,686 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక హుండీద్వారా శనివారం రూ. 2.87 కోట్ల ఆదాయం లభించినట్టు టీటీడీ అధికారులు తెలియజేశారు.

రాశిఫలాలు – ఆదివారం నవంబర్‌ 23, 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *