మనిషి వందేళ్లు బతుకుతాడో లేదో తెలియదుగాని, గాలి, వాన, ఎండను ఎదుర్కొని నిలబడగలిగితే చెట్లు వందేళ్లకు మించి బతుకుతాయి. అలా బతికిన చెట్లు ఈ భూమిపై చాలా ఉన్నాయి. అయితే, మనిషి తన అవసరాల కోసం చెట్లను కొట్టేస్తూ వాటి ఎదుగుదలను ఆదిలోనే తొక్కేస్తున్నారు. వందేళ్లకు మించి బతికిన, ఇప్పటికీ బతికే ఉన్న చెట్లు మనకు ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తాయి. అటువంటి వాటిల్లో ఒకటి ఘనాలో ఉంది. ఆ చెట్టుపేరు ఒన్యినా. దీనిని పవిత్రమైన చెట్టుగా అక్కడి ప్రజలు పూజిస్తారు. ఇలాంటి వందేళ్లకు పైబడిన ఓ చెట్టును స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులు నిరికేసేందుకు ప్రయత్నించారు. దాని కాండాన్ని నరికేందుకు ప్రయత్నించగా, చెట్టు నుంచి నీరు ఒక్కసారిగా ఉబికి వచ్చింది. పవిత్రమైన చెట్టుగా భావించే ఈ ఒన్యినా చెట్టునుంచి వస్తున్న నీటికి శక్తి ఉంటుందని, పలు జబ్బులను నయం చేయగలుతుందని స్థానికులు నమ్ముతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.
Related Posts
పరాశర మహర్షి ఆశ్రమం…మానసిక ప్రశాంతతకు చిహ్నం
పరిచయం: ప్రకృతి ఒడిలో పరాశరుని పవిత్ర నిలయం హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో పర్వతాల మధ్య వెలసిన పరాశర మహర్షి దేవాలయం విశేషమైన పవిత్రతను కలిగి ఉంది.…
పరిచయం: ప్రకృతి ఒడిలో పరాశరుని పవిత్ర నిలయం హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో పర్వతాల మధ్య వెలసిన పరాశర మహర్షి దేవాలయం విశేషమైన పవిత్రతను కలిగి ఉంది.…
శివభక్తులకు గుడ్న్యూస్ః సోమ్నాథ్ నుంచి రుద్రాక్షను ఇలా అందుకోండి
చారిత్రక నేపథ్యం – సోమనాథ మహాదేవుడి పవిత్ర ఆలయం భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో అతి ప్రధానమైనదిగా చెప్పబడే సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని గిర్ సోమనాథ్ జిల్లాలో…
చారిత్రక నేపథ్యం – సోమనాథ మహాదేవుడి పవిత్ర ఆలయం భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో అతి ప్రధానమైనదిగా చెప్పబడే సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని గిర్ సోమనాథ్ జిల్లాలో…
పంచాంగం – 2026, జనవరి 10, శనివారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయణం, హేమంత ఋతువు ఈరోజు పుష్య మాస బహుళ పక్ష సప్తమి తిథి రా.08.23 వరకూ తదుపరి అష్టమి తిథి,హస్త నక్షత్రం…
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయణం, హేమంత ఋతువు ఈరోజు పుష్య మాస బహుళ పక్ష సప్తమి తిథి రా.08.23 వరకూ తదుపరి అష్టమి తిథి,హస్త నక్షత్రం…