తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ఎన్నో సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. షెల్టర్లు, షెడ్డులు, ఉచిత మంచినీరు, ఉచిత భోజనంతో పాటు ఉచిత ప్రయాణ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. స్వామివారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే, శ్రీవారి సేవలో తరించే ఉద్యోగుల విషయంలోనూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉద్యోగులకు ఉచిత ఇళ్ల స్థలాలను అందివ్వగా ఇప్పుడు వారి భద్రత కోసం మరిన్ని నిర్ణయాలు తీసుకున్నది. శ్రీవారి ఆలయంలో పనిచేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ద్విచక్రవాహనాలపై వచ్చే ఉద్యోగులకు హెల్మెట్లు అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్వర్యంలో 500 హెల్మెట్లను పంపిణీ చేశారు. అమలాపురం, హైదరాబాద్కు చెందిన భక్తులు రెండువేల హెల్మెట్లను విరాళంగా అందించారు. వీటిని ఉద్యోగులకు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టుగా అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు రాబోయే రోజుల్లో మరో 7500 హెల్మెట్లను కూడా ఉద్యోగులకు అందించనున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరించాలని అధికారులు చెబుతున్నారు. హెల్మెట్లు భక్తి ఉట్టిపడేలా తయారు చేయించారు. కాషాయం రంగులో ఉండే ఈ హెల్మెట్లు ముందు భాగంలో శ్రీవారి తిరునామం ఉండటం విశేషం. టీటీడీ ఉద్యోగులు అని గుర్తుపట్టేందుకు ఈ హెల్మెట్లు చిహ్నంగా మారనున్నాయి.
Related Posts
వెండి గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారో తెలుసా?
వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ కాలంలో తెలుగు ప్రజల మనసు సహజంగానే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం వైపు మళ్లుతోంది. కాలాన్ని ముందే దర్శించిన…
వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ కాలంలో తెలుగు ప్రజల మనసు సహజంగానే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం వైపు మళ్లుతోంది. కాలాన్ని ముందే దర్శించిన…
రాశిఫలాలు – డిసెంబర్ 21, 2025 సోమవారం
మేష రాశి ఈ రోజు మేష రాశివారికి కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంది. పై అధికారుల నుంచి ప్రశంసలు…
మేష రాశి ఈ రోజు మేష రాశివారికి కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంది. పై అధికారుల నుంచి ప్రశంసలు…