కంచి అనగానే గుర్తుకు వచ్చే దేవత కామాక్షిదేవి. కంచి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పకుండా కంచి కామాక్షిని దర్శించుకుంటారు. అయితే, అమ్మవారు ఆలయంలో ఐదు రూపాల్లో దర్శనం ఇస్తారని, ఈ ఐదు రూపాలనే పంచ కామాక్షి రూపాలు అని పిలుస్తారు. ఇందులో మొదటిది శ్రీ స్వయంభూ కామాక్షి రూపం. ఇది ఆలయంలోని ప్రధాన మూలవిరాట్ రూపం. అమ్మవారు ఆలయంలో స్వయంభూవుగా అవతరించారని అంటారు. మూలవిరాట్ రూపంలోని అమ్మవారు యోగనిద్రలో ఉంటారు. ఇక రెండో రూపం శ్రీ ఊర్ధ్వ కామాక్షీ రూపం. ఓంకారాన్ని సూచిస్తూ తలను పైకెత్తిన రూపంలో కనిపిస్తారు. జ్ఞానం, ఆధ్యాత్మిక లోకారోహణకు సూచికంగా అమ్మవారు దర్శనమిస్తారు. శ్రీ కులకామాక్షిగా మూడో రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తారు. ఇక్కడి అమ్మవారిని శ్రీవిద్యా ఉపాసకుల కులదేవతగా పూజిస్తారు. అమ్మవారిని తంత్ర మార్గంలో పూజించే దేవతగా కొలుస్తారు. శ్రీ శ్రింగేరి కామాక్షి అమ్మవారిగా నాలుగో రూపంలో అమ్మవారిని పూజిస్తారు. ఆదిశంకరాచార్యుల ఆశీర్వాదంతో శ్రింగేరి శారదా పీఠంలో ప్రతిష్టించబడిన రూపాన్ని కామాక్షిదేవిగా ఆరాధిస్తారు. ఇక్కడ అమ్మవారిని త్రిపుర సుందరి రూపంగా ఆరాధిస్తారు. శ్రీ విశాలాక్షి కామాక్షిగా ఐదోరూపంలో అమ్మవారు దర్శనం ఇస్తారు. అమ్మవారు విశాల దృష్టి కలదిగాను, అందరినీ అనుగ్రహించే దేవత రూపంలోనూ ఆరాధిస్తారు. ఈ ఐదు రూపాలను ఎవరైతే దర్శించుకుంటారో వారికి కామకోటి సిద్ధి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కంచీపురంలో ఒకే చోట అమ్మవారి విభిన్నరూపాలు ఉండటం అరుదైన విషయాల్లో ఒకటిగా పండితులు చెబుతున్నారు.
Related Posts

Horoscope – 2025 ఏప్రిల్ 16, బుధవారం
Spread the loveSpread the loveTweetఏప్రిల్ 16వ తేదీ బుధవారం రోజున ఏ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. మేషం (Aries) గోచార ఫలితాలు:చంద్రుడు…
Spread the love
Spread the loveTweetఏప్రిల్ 16వ తేదీ బుధవారం రోజున ఏ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. మేషం (Aries) గోచార ఫలితాలు:చంద్రుడు…

శుక్రవారం ఈ పనులు అస్సలు చేయకండి
Spread the loveSpread the loveTweetశుక్రవారం హైందవులకు అత్యంత ముఖ్యమైన రోజు. ఈరోజు ఆధ్యాత్మికంగా పవిత్రంమైనదిగా భావిస్తారు. ప్రధానంగా మహాలక్ష్మిని ఈరోజున ఆరాధిస్తాం. సంపద, ఐశ్వర్యం, శాంతికి చిహ్నం లక్ష్మీదేవి.…
Spread the love
Spread the loveTweetశుక్రవారం హైందవులకు అత్యంత ముఖ్యమైన రోజు. ఈరోజు ఆధ్యాత్మికంగా పవిత్రంమైనదిగా భావిస్తారు. ప్రధానంగా మహాలక్ష్మిని ఈరోజున ఆరాధిస్తాం. సంపద, ఐశ్వర్యం, శాంతికి చిహ్నం లక్ష్మీదేవి.…

సెప్టెంబర్ 7న ఈ ఆలయం తప్పా అన్నీ మూసివేత…కారణం ఇదే
Spread the loveSpread the loveTweetసెప్టెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఆలయాలు మూతపడనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఆయా ఆలయాల ఆగమ నియమాలను…
Spread the love
Spread the loveTweetసెప్టెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఆలయాలు మూతపడనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఆయా ఆలయాల ఆగమ నియమాలను…