జాతకంలో అన్నిగ్రహాలు అనుకూలంగా ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుంది. ఏ గ్రహమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటే దాని ప్రభావం జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా బుధగ్రహం అనుకూలంగా లేకుంటే బుద్ధి, వ్యాపారం, విద్య, వాణిజ్యం, లావాదేవీల వంటి రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నిర్ణయాలలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఆలోచనలు అస్పష్టంగా ఉంటాయి. చదువు పట్ల శ్రద్ధ తగ్గిపోతుంది. పరీక్షల్లో విఫలం అవుతుంటారు. తెలివితేటలు క్రమంగా తగ్గిపోతుంటాయి. మాటల్లో తప్పులు దొర్లుతుంటాయి. అపార్థాలకు తావుంటుంది. సంబంధాల్లో విబేధాలు కలుగుతాయి. వ్యాపారంలో నష్టాలు తప్పకపోవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో మోసాలు జరుగుతాయి. బుధుడి అనుగ్రహం లేకుంటే నాడీ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. మతిమరుపుతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చర్మసంబంధిత వ్యాధులతో సతమతమౌతారు. బుధగ్రహ దోషాలను నివారించాలంటే ప్రతిరోజూ ఓం బ్రాం బ్రీం బ్రౌం సం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. బుధవారం రోజున ఉపవాసం ఉంటూ పచ్చి మొక్కజొన్నను, పచ్చి కూరగాయలను దానం చేయాలి. బుధవారం రోజున పచ్చని దుస్తులు ధరించాలి. బుధవారం రోజున తులసిమొక్క దగ్గర దీపం వెలిగించాలి. వీలైనంత వరకు చదువుపై దృష్టిపెట్టాలి. ఏ విషయంపైనైనా సరే స్పష్టంగా మాట్లాడటం నేర్చుకోవాలి.
Related Posts

దశరథుడికి శాపంగా మారిన విద్య
Spread the loveSpread the loveTweetఎంత చదివినా…రామాయణం గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఇంకా ఉంటుంది. రామాయణంలో ప్రముఖ పాత్రలు సీతారామ లక్ష్మణులు, హనుమంతుడు, రావణ కుంభకర్ణులు. ఇందులోని ప్రతీ పాత్ర…
Spread the love
Spread the loveTweetఎంత చదివినా…రామాయణం గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఇంకా ఉంటుంది. రామాయణంలో ప్రముఖ పాత్రలు సీతారామ లక్ష్మణులు, హనుమంతుడు, రావణ కుంభకర్ణులు. ఇందులోని ప్రతీ పాత్ర…

కైలాస మానస సరోవరం యాత్ర చేసిన వారికే మోక్షం లభిస్తుందా?
Spread the loveSpread the loveTweetజన్మ మానవుడికి మొదటి అడుగు అయితే… మోక్షమే ఆఖరి గమ్యం. ఈ రెండింటి మధ్య జీవించే సమయం ఎంతో ముఖ్యమైనది. దైవ చింతన, ఆత్మశుద్ధి,…
Spread the love
Spread the loveTweetజన్మ మానవుడికి మొదటి అడుగు అయితే… మోక్షమే ఆఖరి గమ్యం. ఈ రెండింటి మధ్య జీవించే సమయం ఎంతో ముఖ్యమైనది. దైవ చింతన, ఆత్మశుద్ధి,…

పితృదేవతలకు తర్పణాలు విడువకుంటే ఈ దోషాలు తప్పవు
Spread the loveSpread the loveTweetపితృదేవతలకు తర్పణాలు లేదా శ్రాద్ధ కర్మలను తప్పకుండా విధిగా నిర్వహించాలని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ పితృతర్పణాలు విడువకుంటే దోషాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.…
Spread the love
Spread the loveTweetపితృదేవతలకు తర్పణాలు లేదా శ్రాద్ధ కర్మలను తప్పకుండా విధిగా నిర్వహించాలని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ పితృతర్పణాలు విడువకుంటే దోషాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.…